– న్యాయ వ్యవస్థలో బీసీలు వచ్చే వరకు మాకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది
– బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే అడ్డుకుంటారా?
– కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వీ. హనుమంత రావు
హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించడం బాధ కలిగించిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వీ. హనుమంత రావు ఆవేదన వ్యక్తం చేశారు.
‘తారిఖ్ పే తారిఖ్ అని కోర్టు మరో తారిఖ్ ఇచ్చిం ది . అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చే సమయంలో మేం అడ్డుకోలేదు. 56% ఉన్న మేము 42% రిజర్వేషన్లు కావాలని అడిగాం. దానికి సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ అలోచించి నిర్ణయం చేశారు. దానిపై మేము పోతుంటే మళ్ళీ 4 వరకు తీర్పును పొడిగిస్తే ఎలా?
న్యాయవ్యవస్థలో కూడా మాకు అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ కరెక్టే అన్నాడు. న్యాయ వ్యవస్థలో బీసీలు వచ్చే వరకు మాకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే అడ్డుకుంటారా?’ అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ తమ నోటి దగ్గరి ముద్దను లాక్కున్నాయని మండిపడ్డారు.