Suryaa.co.in

Andhra Pradesh

నిర్మాణ రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం

-మంగళగిరిలో కన్ స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటు చేస్తాం
-బైక్ మెకానిక్ లకు ఆధునాతన వాహనాలపై శిక్షణ
-బైక్ మెకానిక్ లు, ఇసుక కార్మికులతో నారా లోకేష్ భేటీ

ఉండవల్లి: రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణ కార్మికులకు మెరుగైన శిక్షణ కోసం మంగళగిరిలో కన్ స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటుచేస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, ప్రాతూరు, గుండిమెడ, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలకు చెందిన ఇసుక ముఠా కార్మికులతో ఉండవల్లి నివాసంలో యువనేత భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… జగన్ పాలనలో మొదటి బాధితులు భవన నిర్మాణరంగం కార్మికులే. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ఇసుక విధానం తీసుకువచ్చి, నిర్మాణరంగానికి గత వైభవం చేకూరుస్తాం. జగన్ పాలనలో ఇసుక అందుబాటులో లేకుండా చేయడం, అమరావతి నిర్మాణ పనులు నిలిపివేయడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనుల్లేక వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

గతంలో కార్మిక బోర్డు ద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం.. నేడు జగన్ పాలనలో కార్మిక బోర్డు నిధులు రూ.2500 కోట్లు పక్కదారి పట్టించారు. అధికారంలోకి వచ్చాక కార్మిక సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేయడంతో పాటు చంద్రన్న బీమా పథకం, పనిముట్లు అందజేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఇసుక క్వారీలు, భవననిర్మాణ రంగ కార్మికులు ఈ సందర్భంగా తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. పాత ఇసుక విధానం తీసుకురావాలి. ఇసుక క్వారీల్లో అక్రమ మైనింగ్ వల్ల భూగర్భ జలాలు పడిపోయి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలి. యంత్రాలతో కాకుండా మాన్యువల్ గా ఇసుకను తోడే విధంగా చర్యలు తీసుకోవాలని కోవాలి. కార్మిక బోర్డులో తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసి సాయం చేయాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.

మెకానిక్ లకు సబ్సిడీరుణాలు, చంద్రన్న బీమా
గత ఎన్నికలపుడు మంగళగిరిలో నేను గెలిస్తే ఆటోనగర్ తొలగిస్తానని దుష్ప్రచారం చేశారు, నేడు ఆటోనగర్ లను కబ్జాచేసేందుకు జీవోలు తెచ్చిన పార్టీ వైసీపీ అని యువనేత నారా లోకేష్ మండిపడ్డారు. ఉండవల్లిలోని నివాసంలో టూ వీలర్ అసోసియేషన్ ప్రతినిధులతో యువనేత ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… నేడు అనేక కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. బీస్ 5, బిఎస్ 6, ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. దానికి అనుగుణంగా బైక్ మెకానిక్స్ కి శిక్షణ ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా లేదా పార్లమెంట్ ని యూనిట్ గా తీసుకొని బైక్ రిపేర్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అధునాతన పనిముట్లు అందిస్తాం. మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చాక బైక్ మెకానిక్స్ కి ప్రభుత్వ గుర్తింపు కార్డులు, వైద్యసౌకర్యం, చంద్రన్న భీమా అమలు చేస్తాం. ఆటోనగర్ లో మెరుగైన వసతులు కల్పిస్తాం. టూ వీలర్ మెకానిక్ లను అన్ని విధాల ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా టూ వీలర్ మెకానిక్ లు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అసోసియేషన్ కు కమ్యూనిటీ భవనం నిర్మాణంతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. పనిముట్లు, షాపుల అభివృద్ధికి సబ్సీడీపై రుణాలు మంజూరుచేయాలని విజ్ఞప్తి చేశారు. ఆటోనగర్ లో గ్యారేజీలకు స్థలాలు ఇవ్వాలని కోరారు. తమ పిల్లల చదువులకు ఇబ్బందులు పడుతున్నామని, జగన్ పాలనలో నిలిచిపోయిన విదేశీ విద్య పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE