Suryaa.co.in

Andhra Pradesh

వైసిపి నేతలు ఆక్రమించిన‌ వక్ఫ్ బోర్డు భూములను తిరిగి స్వాధీనపరుస్తాం

– ముస్లింల ఆస్తులకేగాక మాన,ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది
– నారా లోకేష్

లోకేష్ ను కలిసిన మదనపల్లి ప్రముఖులు

• మదనపల్లి పట్టణంలోని 8,9వార్డులకు చెందిన పలువురు ప్రముఖలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
• మదనపల్లిలో ఎటువంటి పరిశ్రమలు లేకపోవడంతో ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రానికి వలస వెళ్లాల్సి వస్తోంది.
• మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవు.
• పట్టణంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి, ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది.
• మదనపల్లి నియోజకవర్గంలో వేలాది రైతులు ఆధారపడిన టమోటాకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలి.
• మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలి.
• ఆర్టీసి బస్టాండు దగ్గరనుంచి బర్మా వీధివరకు ఫ్లైఓవర్ నిర్మించాలి.
• పెద్దతోపు రోడ్డును బైపాస్ రోడ్డువరకు విస్తరించి ట్రాఫిక్ ను నియంత్రించాలి.
• చంద్రబాబునాయుడు హయాంలో మదనపల్లికి మంజూరుచేసిన షాదీమహల్ ఇప్పటివరకు నిర్మాణదశలోనే ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిని పూర్తిచేయాలి.
• మదనపల్లి నియోజకవర్గంలో ఉర్దూ జూనియర్, డిగ్రీకాలేజీలను ఏర్పాటుచేయాలి.
• మదనపల్లి అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను అధికారంలోకి వచ్చాక తిరిగి వక్ఫ్ బోర్డుకు స్వాధీనంచేసి రక్షణ కల్పించాలి.
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉర్దూను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూను రెండవ అధికారభాషగా అమలుచేయాలి.
• హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సహాయం పెంచాలి.
• ఎస్సీ, ఎస్టీ, బిసిల మాదిరి ముస్లింలకు ప్రత్యేక సబ్ ప్లాన్ కేటాయించాలి.
• మదనపల్లిలో మైనారిటీ భవన్ కోసం స్థలం కేటాయించాలి.
• మైనారిటీ కార్పొరేషన్ ద్వారా గత టిడిపి ప్రభుత్వంలో అమలుచేసిన పథకాలను పునరుద్దరించాలి.
• ముస్లింలలోని మొఘల్, సయ్యద్, పఠాన్ లను బిసి-ఇ కేటగిరిలో చేర్చాలి.

నారా లోకేష్ స్పందిస్తూ….

• దేశంలోనే మొట్టమొదటి మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటుచేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది.
• రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల ఆస్తులకేగాక మాన,ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది.
• వైసిపి నేతలు ఆక్రమించిన‌ వక్ఫ్ బోర్డు భూములను తిరిగి స్వాధీనపరుస్తాం. వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలచ్చి, ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటాం.
• గత ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు అమలుచేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం.
• మదనపల్లిలో షాదీమహల్ నిర్మాణాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిచేస్తాం.
• మైనారిటీలంతా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి చంద్రన్నను సిఎం చేసేందుకు సహకరించండి.

 

LEAVE A RESPONSE