Suryaa.co.in

Andhra Pradesh

పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, స్వామినాథన్ కు భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం

• భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు

మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించడం చాలా సంతోషకరం. తెలుగు జాతి ముద్దుబిడ్డ, బహుబాషా కోవిదుడైన పీవీ నరసింహారావు…ప్రధానిగా దేశానికి అందించిన సేవలు మరువలేనివి. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పధం వైపు పరుగులు పెట్టించారు. నేడు మనదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే అందుకు ఆరోజు ఆయన వేసిన పునాదులే కారణం.

ప్రధానిగా చరణ్ సింగ్ అందించిన సేవలు మరువలేనివి. అలాగే ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. తన పరిశోధనలతో నూతన వంగడాలు సృష్టించడంతో భారతదేశ వ్యవసాయ ముఖ చిత్రమే మారిపోయింది. ఇటువంటి భరతమాత ముద్దుబిడ్డలకు దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

LEAVE A RESPONSE