Suryaa.co.in

Andhra Pradesh Telangana

ఈ శోకం ఇచ్చే సందేశం ఏమిటి?

– కళ్లు తెరచి ఓటేయండి

ఈ అబ్బాయి ఎంత మందికి గుర్తు ఉన్నాడో నాకు తెలియదు,
కానీ నేను మాత్రం మర్చిపోలేను..
పేరు సదాశివరెడ్డి నాలుగు రోజుల్లో విదేశాలకు వెళ్లి కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్దపడిన యువ ఇంజినీర్,
2007లో ఆసియాలోనే అత్యంత నైపుణ్యంగల ఇంజనీర్ గా విదేశాల్లో మంచి ఉద్యోగం సాధించాడు, దురదృష్టవశాత్తు హైదరాబాద్ గోకుల్చాట్ వద్ద 2007లో ఉగ్రవాదులు చేసిన మారణ హోమం కారణంగా, మెదడులో ఇనుప ముక్కలు తగలడంతో ఇలా జీవచ్చంగా మారిపోయాడు,
అవలీలగా 5,6 భాషలు(జపనీస్ కూడా) మాట్లాడే వ్యక్తి. ఇప్పుడు కేవలం అమ్మా అనే మాట తప్ప ఇంకేం మాట్లాడలేకుండా అయిపోయాడు.
నేటికి 15 ఏళ్ళు అయిన ఆ ఉదంతం ఈ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది.
వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడు అనుకున్న కొడుకు, ఇలా కళ్ళ ముందు బ్రతికి ఉన్న శవం లా తిరుగుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి?
ఓటు అలోచించి వెయ్యండి. దేశద్రోహ పార్టీలకు ఓటు వేసి జీవచ్ఛవాలలా బ్రతకకండి. అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీ మహరాజ్ వారసులుగా ధీరత్వంగా బ్రతకండి. మన హిందూ దేవాలయాలను రక్షించి అభివృద్ధి చేసి, ఎన్నో నూతన దేవాలయాలు ఇతర ఆధునిక అభివృద్ధి చేసే పార్టీకే విచక్షణా జ్ఞానంతో అమూల్యమైన ఓటు వేసి, మీ ఓటు హక్కు విలువని పెంచుకోండి.

– పి.సి

LEAVE A RESPONSE