Suryaa.co.in

Political News

ఏ రాష్ట్రాలకు రాని సమస్య..కెసిఆర్ కి ఎలా వచ్చింది?

– కెసిఆర్ మహాధర్నా ముందు.. అసలు వాస్తవం ఏంటో తెలుసుకుందాం
మొదట కేంద్రం కొనేది వడ్లు కాదు బియ్యం అనేది గుర్తించండి. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు సేకరించి బియ్యం పట్టించి కేంద్రానికి ఇవ్వాలి అప్పుడు కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది అప్పుడు ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చెయ్యలి. ఇది జరగాల్సిన ప్రక్రియ జరుగుతున్న ప్రక్రియ.
అయితే వడ్ల నుండి డైరెక్ట్ బియ్యం తీస్తే వాటిని Raw Rice అంటారు. (పంట చేతికి రాగానే మనం ఇంటి దగ్గర గిర్ని లో పట్టించుకున్నట్లు) ఇందులో నూకల శాతం ఎక్కువ మరియు మెత్తగా అవుతుంది అన్నం.
వడ్లను మిషన్ లో త్వరగా ఆరబెట్టి బియ్యం చేస్తే Streaming Rice అంటారు ( బియ్యం దుకాణాలలో Packing చేసి అమ్మే బియ్యం మనం ఫంక్షన్స్ లో వాడే బియ్యం) ఈ బియ్యం లో నూకల శాతం తక్కువ బియ్యం చాలా బాగా ఉంటాయి.వడ్లను ఉడకబెట్టి బియ్యం చేస్తే వాటిని Boil Rice అంటారు (ఇవ్వి పూర్వం తినే వారు గోధుమ రంగు లోకి మారీ గట్టిగా తయారవుతాయి) ఇందులో నూకల శాతం అనేది ఉండదు.
రైతులు తినేది Raw Rice. ఫంక్షన్ లలో , దేశ విదేశాలకు Export చేసేది Streaming Rice
So ఇప్పుడు Boil Rice విషయానికి వస్తె పూర్వం చాలా తినేవారు ఇప్పుడు చాలా తక్కువ అయింది. విదేశాలలో కూడా డిమాండ్ లేదు మనదేశం లో కూడా చాలా అంటే చాలా తక్కువ గా తింటున్నారు. ఇప్పుడు కేంద్రం ఏమన్నదీ అంటే BOIL RICE కాకుండా STREEMING RICE పంపించండి అని రాష్ట్రానికి రాసిన లెటర్ లోని సారంశం.ఇక్కడ ఉంది అసలు తిరకాసు.
కేంద్రం రైతుల గురించి కానీ వారు పండించే పంట గురించి కానీ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. రైతుల నుండి వడ్లు సేకరించి బియ్యం పట్టి మాకు పంపండి. కానీ దేశీయ అంతర్జాతీయ మార్కెట్ లో BOIL RICE కీ Demand లేదు కాబట్టి BOIL RICE వద్దు అన్నది.ఇది అసలు పాయింట్
BOIL RICE లో తరుగు నూకల శాతం ఉండదు కావున STREEMING RICE కంటే ఎక్కువ మొత్తం వడ్ల నుండి డెలివరీ వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి రైస్ మిల్లర్లకు అదనంగా లాభం వస్తుంది. ఉన్నట్టుండి కేంద్రం BOIL RICE వద్దు అనేసరికి ఇటు ప్రభుత్వానికి మరియు మిల్లర్లకు ఎం చెయ్యాలో ఎలా చెయ్యాలో పాలుపోక వారి సమస్యను రైతులకు అంటగట్టి కేంద్రం వడ్లు కొనను అంటుంది అని నిందలు వేసి కేంద్ర ప్రభుత్వం ను బద్నాం చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు STREEMING RICE పంపిస్తే ఎవరికి ఎం ప్రోబ్లం ఉండదు. కానీ వీళ్లకు లాభం ఉండదు కదా అందుకని BOIL RICE కొనమని కేంద్రం పై ఒత్తిడి తెస్తున్నారు.BOIL RICE నిల్వలు ఇప్పటికే కేంద్రం దగ్గర చాలా ఉన్నాయ్ ప్రజలు BOIL RICE కంటే STREEMING RICE కే అలవాటు పడ్డారు. కాబట్టి ఇక మీద BOIL RICE వద్దు అనేది కేంద్రం వాదన.పంజాబ్ లోనీ రైతులు వానాకాలం వడ్లు పండిస్తారు. ఎండాకాలం గోధుమ పంట వేస్తారు.అందుకే వానాకాలం ఎంత పండిన 100% పంట సేకరించి స్ట్రీమింగ్ రైస్ చేసి కేంద్రానికి పంపిస్తారు.
మన రాష్ట్రంలో యాసంగిలో వరి వేస్తం కాబట్టి , BOIL వద్దంటోంది కేంద్రం కాబట్టి STREEMING RICE చేస్తే, నూకల శాతం ఎక్కువ వస్తుంది. దీనివల్ల ప్రభుత్వం మరియు మిల్లర్లకు తక్కువ లాభాలు వస్తాయి దెబ్బ పడుతుంది. కాబట్టి వారి స్వంత సమస్యను రైతులపై రుద్దాలని చూస్తున్నారు.యాసంగి పంట మార్పిడి చేపట్టలంటే రైతుకు అవగాహన కల్పించాలి మద్దతు ధర ముందే ప్రకటించాలి తగిన విత్తన సబ్సిడీ ఇవ్వాలి. భూ సార పరీక్షలు నిర్వహించాలి వాణిజ్య పంటలను పరిచయం చెయ్యాలి అప్పుడే రైతులు పంట మార్పిడి చేస్తారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ చెయ్యాల్సి ఉంటుంది. ఇదే మాట కేంద్రం కూడా చెప్పుకొచ్చింది.
వరి ఉత్పత్తి లో మొదటి స్థానంలో వెస్ట్ బెంగాల్..ఉత్తర ప్రదేశ్…పంజాబ్…మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి…నాలుగవ స్థానంలో తమిళ్ నాడు…5 వ స్థానం లో ఆంధ్ర ప్రదేశ్…6 వ స్థానంలో బీహార్…ఛత్తీస్గఢ్… అటు ఇటుగా తెలంగాణ ఉంది.ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో రాని సమస్య….పంజాబ్ లో రాని సమస్య…తమిళ్ నాడు లో రాని సమస్య…ఛత్తీస్గఢ్ లో రాని సమస్య…..ఆంధ్ర ప్రదేశ్ లో రాని సమస్య….కేవలం వడ్ల కొనుగోలు సమస్య కేవలం తెలంగాణ లో మాత్రమే ఎలా వచ్చింది .పైన వరి ఉత్పత్తి ఎక్కువ గా ఉన్న రాష్ట్రాల లో ఒక్క ఉత్తర ప్రదేశ్ లో తప్ప, ఎక్కడా బీజేపీ లేదు. మరి తమిళ్ నాడు ..బెంగాల్…పంజాబ్, ఛత్తీస్గఢ్ …ఆంధ్ర ప్రదేశ్ లో రాని సమస్య రాని సమస్య కెసిఆర్ కి ఎలా వచ్చింది?ఏ రాష్ట్రం కి రాని సమస్య కెసిఆర్ కి ఎలా వచ్చింది? కొంచెం. ఆలోచన చెయ్యండి!

– రమణ వల్లాల

LEAVE A RESPONSE