పబ్లిసిటీ కే పరిమితం అయిన స్పందన కార్యక్రమం ఎందుకు?

– టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను ఆదుకోవాలన్న టీడీపీ అధినేత

ఏపీలో అధికార మదంతో సామాన్య ప్రజలపై జరుగుతున్న వేధింపులకు ముగింపు ఎప్పుడు? అన్నవరానికి చెందిన ఆరుద్ర అనే మహిళ న్యాయం కోసం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరం. కూతురి వైద్యానికి తన ఇంటిని అమ్ముకునే స్వేచ్ఛ కూడా ఆమెకు లేకుండా చేయడం దారుణం. దీనికి కారణం అయిన మంత్రి గన్ మెన్ తదితరులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. తనకు న్యాయం చేయమని గతంలో కాకినాడ కలెక్టరేట్ ముందు ఆరుద్ర ధర్నా చేసినప్పుడే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంతవరకు వచ్చేదా? ప్రజలను కలవాలంటే ఈ ముఖ్యమంత్రికి అహంకారం అడ్డొస్తుందా? ప్రజల సమస్యలు పరిష్కరించలేనప్పుడు పబ్లిసిటీకి పరిమితమైన స్పందన కార్యక్రమంతో ఎవరికి ఉపయోగం?

Leave a Reply