కశ్మీర్లో మతం అడిగి మరీ మారణకాండకు పాల్పడిన పాక్ ముష్కరమూకలను జల్లెడపట్టిమరీ హతమార్చిన భారత్.. అందుకు పెట్టిన పేరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ నిర్వహించిన దీనిపై ఆసక్తి వ్యక్తమవుతోంది.
సంప్రదాయంగా, సిందూరం (కుంకుమ) వివాహిత హిందూ మహిళలు ధరిస్తారు. అయితే, ఈ ఆపరేషన్ సందర్భంలో పహల్గామ్లో జరిగిన ఘోరమైన దాడి ఘటనలకు ఈ పేరు ప్రతీకగా నిలుస్తుందని నమ్ముతున్నారు. ఆ దాడిలో ఉగ్రవాదులు బాధితులను వారి పేర్లు, మతం అడిగి తెలుసుకున్న తర్వాతే హత్య చేశారని కథనాలున్నాయి.
ఈ ఆపరేషన్కు ‘సిందూర్’ అని నామకరణం చేయడం ద్వారా.. ఆనాటి బాధితులకు నివాళులర్పించడంతో పాటు, న్యాయం జరుగుతుందనే ఒక బలమైన సందేశాన్ని, ఆ ఘటనను గుర్తుచేస్తూ భారతదేశం ఈ చర్య చేపట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.దానితోపాటు.. కశ్మీర్లో భర్తలను కోల్పోయిన మహిళల కోసం ఈ పేరు పెట్టడం ద్వారా, వారి త్యాగాలకు గుర్తింపు ఇచ్చినట్లు ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ.