గుంటూరు: రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న రైల్వే, రహదారులు, పర్యావరణ అనుమతుల కోసం కృషి చేస్తున్నట్లు భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. జిల్లాకు సంబంధించిన వివిధ అంశాలపై గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్తో జీవీఎల్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడులో కృషి విజ్ఞాన కేంద్రం, రొంపిచర్లలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. జిల్లాలో వరికపూడిశల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పల్నాడులో బుగ్గవాగు ప్రాజెక్టును సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. విభజన తర్వాత ఏపీకి రావాల్సిన జాతీయ సంస్థలను తీసుకొస్తున్నామని చెప్పారు. మిగతా పార్టీలు రాజకీయాల గురించి మాట్లాడుతాయని.. భాజపా దృష్టంతా దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమంపైనే ఉంటుందని జీవీఎల్ నరసింహరావు వెల్లడించారు.
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…