Suryaa.co.in

Andhra Pradesh

తెలుగు దేశం పార్టీతోనే మహిళా సాధికారత

-మహిళల కోసం టీడీపీ తెచ్చిన ప్రత్యేక పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడు
-తన ఆదాయం కోసం నాసిరకం మద్యంతో సిఎం మహిళల తాళిబొట్లు తెంచాడు
-వైసీపీ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్ కు కేంద్రంగా మారిపోయింది
-కుప్పం వచ్చిన ప్రతి సారీ నాకు నూతన శక్తి వస్తుంది
-కుప్పంలో నాడు ఇంటికి రెండు ఆవులు ఉండాలి అంటే ఎగతాళి చేశారు
-నేడు అదే కుప్పం పాల ఉత్పత్తిలో రికార్డులు సృష్టించింది
-వైసీపీకి ఎవరు ఓటు వేసినా సమాజానికి ద్రోహం చేసినట్లే
-సిద్దం అంటున్న జగన్ ను ఓడించడానికి జనమంతా సిద్ధం అంటున్నారు
– కుప్పంలో మహిళా సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు
– చిత్తూరు ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుమళ్ల ప్రసాదరావును ఆశీర్వదించమని విజ్ఞప్తి
– కుప్పం మహిళా సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం వివరాలు

• రాష్ట్రం, దేశంలో మొట్టమొదటిసారిగా మహిళల అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడిన ఏకైక పార్టీ టీడీపీ. మొదటి సారిగా ఎన్టీఆర్ మీ గురించి ఆలోచించి ఆస్తిలో సమానహక్కు కల్పించారు.
• స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చాం. సర్పంచులు, ఎంపీటీసలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు మహిళలు అయ్యారంటే దానికి ఎన్టీఆర్ ఇచ్చిన 8 శాతం రిజర్వేషన్లే కారణం.
• మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొచ్చాం. చదువుకోని మహిళలను ఇంటికొకరి చొప్పున డ్వాక్రా సంఘాలు పెట్టాం. మిమ్మల్ని ఎగతాళి చేసే రోజుల నుండి ఇంటిని కాపాడే పరిస్థితి వచ్చారని నిరూపించింది టీడీపీనే.
• మహిళల కోసం వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాం. లక్షల మంది మహిళల జీవితాలు బాగున్నాయంటే అది టీడీపీ చొరవ.
• నేను మొదటి సారి కుప్పం వచ్చినప్పుడు డ్వాక్రా సంఘాలు లేవు..కానీ ఇప్పుడు 60 వేల మంది ఉన్నారు. డ్వాక్రా సంఘాలతో పాటు పాడిపరిశ్రమను ప్రోత్సహించాం.
• ఇంటికి రెండు ఆవులు పట్టిస్తా అంటే నవ్వారు…ఇప్పుడు కుప్పంలో 4 నాలుగు లక్షల లీటర్ల పాలు సేకరణ జరుగుతోంది.
• మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి వేసిన మొదటి అడుగు పాడిపరిశ్రమ.
• నా తల్లిని చిన్నతనంలో చూశాను…కట్టెల పొయ్యితో ఇబ్బంది పడేది. కట్టెల పొయ్యిలు పోయి మహిళలు ఇబ్బంది లేకుండా ఉండాలని దీపం పథకం ద్వారా వంటగ్యాస్ అందించాను.
• మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ఆత్మగౌరవం పేరిట మరుగుదొడ్లు కట్టించాం. మధ్యాహ్న భోజన పథకం పెట్టి అందులోనూ మహిళలకు అవకాశం కల్పించాం. అంగన్వాడీ, రేషన్ షాపులు, సుజల శ్రవంతి వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసి మహిళలకు అవకాశం కల్పించాం.
• ఒంటరి మహిళలకు పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది టీడీపీనే. స్కూలుకు వెళ్లడానికి ఆడపిల్లలు ఇబ్బందులు పడుతుంటే ఆడపిల్లలందరికీ సైకిళ్లు అందించాం.
• ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పెట్టాం. కండక్టర్లుగా కూడా మహిళలను నియమించాం.
• ప్రతి కిలోమీటరుకు ఒక ఎలమెంటరీ స్కూలు, ప్రతి 3 కి.మీ అప్పర్ ప్రైమరీ, మండలానికి ఒక జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్ కు ఒక ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చాం.
• పసుపుకుంకమ ద్వారా రూ.8,800 కోట్లు అందించి…రూ.10 వేల కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేశాం. ఉచితంగా 11 రకాల వైద్య సదుపాయాలు అందించాం.
• అన్న అమృత హస్తం కింద గర్భిణులకు పరీక్షలు, బేబీ కిట్లు కూడా అందించాం. తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్, బాలామృతంతో పాటు ప్రసవించినప్పుడు రూ.5,500 ఆర్థికసాయం అందించాం. పెళ్లికానుకలతో పాటు ఒక అన్నగా సామూహిక సీమంతాలు నిర్వహించాం.
• కానీ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా.? ఆడపిల్లలకు జగన్ ఫ్రభుత్వం ఏం చేసింది.
• కొత్త పథకాలకు శ్రీకారం చుట్టాం…ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది ఆడబిడ్డలకు నెలకు రూ.15 వందలు ఆడబిడ్డ నిధి కింద అందిస్తాం. నేరుగా మీ అకౌంట్లోకే డబ్బులు వస్తాయి.
• ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు అందిస్తాం.
• గ్యాస్ ధరలు పెరిగాయి…పెట్రోల్, డీజల్, కందిపప్పు, చింతపండు, పంచదార అన్ని ధరలు పెరిగాయి. మద్యం ధరకు రెక్కలు వచ్చాయి. క్వార్టర్ మద్యం రూ.60 నుండి 200లకు పెంచి వంద దోచేసిన జలగ జగన్.
• నాసిరకం మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లు తెంచాడు. మీకు ఇచ్చేది రూ.10లు..దోచేది రూ.100లు. జలగ మాదిరిగా జగన్ జనం రక్తం తాగుతున్నారు.
• కుప్పంలో రాళ్లు, ఇసుకను కూడా దోచుకున్నారు. రౌడీలు జాగ్రత్తగా ఉండాలి…జజారులో నిలబెడతా.
• రాష్ట్రంలో మహిళలంతా టీడీపీ పక్షమే. టీడీపీకి ఓటేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భర్తలకు మహిళలు చెప్పాలి.
• నన్నే ఎన్నో సార్లు వేదించారు. అసెంబ్లీలో నన్ను తిట్టారు. రాజకీయాల్లో లేని నా సతీమణి భువనేశ్వరిని అవమానించారు.
• నాడే చెప్పా…కౌరవసభను గౌరవసభగా చేసి సీఎంగానే అడుగుపెడతానని. మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఈ 40 రోజులు మీరు కష్టపడి టీడీపీని గెలిపించాలి.
• ఎక్కడికి వెళ్లినా రాని ఆనందం కుప్పం వస్తే ఉంటుంది. నాకు స్ఫూర్తి కుప్పం. మీ నిండు మనసుతో నన్ను 7 సార్లు ఆదరించి గెలిపించారు.
• మళ్లీ గెలిచే ముందు మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. నిజమైన దేవతలు ఆడబిడ్డలే.
• ఆడబిడ్డలు కోరుతున్నా…మీకు అండగా ఉంటా. మీ ద్వారా మీ కుటుంబాన్ని బాగు చేసే పరిస్థితి రావాలి…మీ ఆదాయాన్ని పెంచి చూపిస్తాం.
• జగన్ లా రూ.10 ఇచ్చి వంద కొట్టేసే ఆలోచన నాది కాదు. సంపద సృష్టించి మీ ఆదాయాన్ని పెంచుతా. రూ.10లు ఇచ్చి రూ.100 సంపాదించే మార్గాన్ని చూపిస్తా.
• సంపద సృష్టిస్తూ పేదరికం లేని సమాజం చేస్తా.
• నేను సీఎంగా ఉన్నప్పుడు గురజాలలో ముస్లిం బాలికపై అత్యాచారం జరిగింది…24 గంటల్లో పట్టుకోవాలని ఆదేశించడంతో చెట్టుకు ఉరేసుకుని నిందుతుడు చనిపోయాడు.
• ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు. నేడు రాష్ట్రంలో గంజాయిని వాణిజ్య పంట చేశారు. డబ్బులకు కక్కుర్తి పడి విదేశాల నుండి డ్రగ్స్ తెస్తున్నారు.
• జగన్ తన చీకటి వ్యాపారాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అవసరం అయితే మహిళలకు ప్రత్యేక చట్టం తెచ్చి రక్షణ కల్పిస్తాం.
• మహిళలు పూర్తిగా రాజకీయాల్లోకి వస్తే కుర్చీ కోసం మగవారు ఎతుక్కునే పరిస్థితి వస్తుంది.
• 45 ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రజలకు రుణపడి ఉన్నా. అన్నగా..తమ్ముడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా…వచ్చే ఎన్నికల్లో మనందరి లక్ష్యం లక్ష మెజారిటీనే పెట్టుకోవాలి.
• నియోజకవర్గంలో 75 శాతం ఓట్లు టీడీపీకే రావాలి. రాష్ట్రం, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేవారు వైసీపీకి ఓటు వేయరు.
• కుప్పంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. గౌనివారి శ్రీనివాసులను 30 రోజులు జైల్లో పెట్టారు.
• నేను బతికేది రాష్ట్రం, ప్రజల కోసం. గాడి తప్పిన పాలనను మళ్లీ గాడిలో పెడతా.
• ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలి. నాకు ముఖ్యమంత్రి పదవి కొత్తకాదు. నాకు ముఖ్యం రాష్ట్రం, ప్రజలు.
• ప్రపంచం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే ఏపీ తిరోగమనంలో వెళ్తోంది.
• నేను ఎన్నికల కోసం ఇక్కడికి రాలేదు. కల్లిబొల్లి మాటలు చెప్పేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. సిద్దం అంటున్న వైసీపీని ఓడించడానికి జనమంతా సిద్దంగా ఉన్నారు.
• క్వార్టర్ బాటిల్, గంజాయి ఇవ్వడానిక సిద్ధంగా ఉన్నారు. వీళ్లు చెప్పి చేయించే నేరాలు…ఘోరాలు చేస్తే జీవితాలు నష్టపోతాయి.
• వైసీపీకి పని చేస్తే కుటుంబాలకు, సమాజానికి ద్రోహం చేసినట్లే. జగన్ ను ఇంటికి పంపడానికి మహిళలంతా సిద్ధంగా ఉన్నారు.
• పథకాలు తీసేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారు…అవి మీ డబ్బులే వారి డబ్బులు కాదు.
• రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పమే అవ్వాలి. కుప్పం ప్రజలకు ఏం చేయాలో నేను చూసుకుంటా.
• కుప్పం ప్రజలు నన్ను మనసులో పెట్టుకుని చూసుకున్నారు. నన్ను గెలిపించిన కుప్పం ప్రజలను ఎప్పుడూ మర్చిపోను. మనం ఒకరి జోలికివెళ్లం..మన జోలికి వస్తే వదిలిపెట్టం.

LEAVE A RESPONSE