వైసిపి నేతలకు ఒళ్లు బలిసి కన్నూ మిన్నూ కానరావడం లేదు

-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

వైసిపి నేతలకు ఒళ్లు బలిసి కన్నూ మిన్నూ కానరావడం లేదు. ప్రశ్నించిన రైతుని, రైతుని ఆపలేదని పోలీస్ అధికారిని, కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధిని నోటికొచ్చినట్టు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడటం దారుణం. విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో జరిగిన రైతు భరోసా

కార్యక్రమంలో బ్రాహ్మణులను కించపరిచేలా పంతులూ నీ సంగతి చూస్తా అంటూ పాత్రికేయుడు గణేష్ ని బెదిరించడం వైసిపి నాయకుల అహంకారానికి నిదర్శనం. ఫ్రస్టేషన్ లో మీడియా ప్రతినిధిని కులం పేరుతో దూషించడం, రైతుని బూతులు తిట్టడం, ఎస్సైని ఒరేయ్ అంటూ చిందులు తొక్కడం చూస్తుంటే.. వైసిపి నేతలకు రోజులు దగ్గర పడినట్టే కనిపిస్తోంది.

Leave a Reply