Suryaa.co.in

Andhra Pradesh

ఘనంగా ముఖ్యమంత్రి, వైయస్సార్ సిపి అధ్యక్షులు వైయస్ జగన్ జన్మదిన వేడుకలు

– కేక్ కట్ చేసిన వైయస్ జగన్ నిండునూరేళ్ళు ప్రజల ఆదరాభిమానాలతో వర్ధిల్లాలని అభిలషించిన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పార్టీ కార్యకర్తలు రక్తదానం చేసారు. పేదలకు దుస్తులు,కుట్టుమిషన్లు,దివ్యాంగులకు ట్రైసైకిల్స్ అందచేశారు.పేదలకు అన్నదానం చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖమంత్రి మేరుగ నాగార్జున,శాసనమండలిలో ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి,ఎంపి నందిగం సురేష్,శాసనమండలి సభ్యులు పోతుల సునీత,కల్పలతారెడ్డి, శాసనసభ్యులు తిప్పేస్వామి,తెలుగు అకాడమి చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి పలువురు పార్టీ నేతలు,కార్పోరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు.

రాష్ర్ట ముఖ్యమంత్రి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైౌయస్ జగన్ జన్మదిన వేడుకలు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో కన్నులపండుగగా జరిగాయి.ఈ సందర్భంగా భారీ కేక్ ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు.రాష్ర్ట మంత్రి మేరుగ నాగార్జున,శాసనమండలిలో ప్రభుత్వ విప్ లేళ్లఅప్పిరెడ్డి,నందిగమ్ సురేష్ శాసనమండలి సభ్యులు పోతుల సునీత,కల్పలతారెడ్డి,శాసనసభ్యులు తిప్పేస్వామి,తెలుగు అకాడమి ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి పలువురు పార్టీ నేతలు,కార్పోరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కోట్లాది మంది హృదయాల్లో దివంగ‌త నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. పేద వర్గాలు,బడుగు,బలహీన వర్గాల ప్రజలు వారి కాళ్ళపై వాళ్లు నిలబడే విధంగా ప్రజల జీవితాల్లో పూర్తి మార్పు తీసుకుని రావటం అంత తేలిక కాదు.. దీన్ని నిజం చేసి చూపించిన వ్యక్తులు అప్పుడు వైయ‌స్ రాజశేఖర రెడ్డి అయితే నేడు ఆయన కుమారుడు వైయ‌స్ జగన్ కే సాధ్యం అయింది అని అన్నారు.

తండ్రిని మించిన తనయుడిగా వైయ‌స్‌ జగన్ ఎదగటం ఆయనపై నమ్మకం పెంచుకున్న ప్రజలందరికి గర్వ కారణం.. వైయ‌స్ఆర్ కన్న కలలను నిజం చేస్తున్న వ్యక్తి వైయ‌స్ జ‌గన్ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.గతంలో రాజకీయపార్టీలు ంఎస్సీ,ఎస్టీ,బిసి,మైనారిటీలను ఓటుబ్యాంక్ గా చూసేవి కాని వైయస్సార్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత వైయ‌స్‌ జగన్‌దేనన్నారు. ఇచ్చిన హమీలను నెరవేర్చి.. పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నేత వైయ‌స్ జగన్ అని పేర్కొన్నారు.

ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా బతికగలిగే అవకాశం ఈ రాష్ట్రంలోనే కనిపిస్తుంది అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రజలకు ఏం చేయనవసరం లేదు.. చేసినట్లు నటిస్తే చాలు అని భావించే వ్యక్తి చంద్రబాబు.. మీడియాను అడ్డం పెట్టుకుని ఏదో చేసినట్లు ప్రజలకు భ్రమ కల్పించవచ్చని చంద్రబాబు భావిస్తారు.. ఉన్న డబ్బులు కాంట్రాక్టర్లకు దోచి పెట్టి దానిలో నుంచి తన వాటా తీసుకోవచ్చన్నది చంద్రబాబు వైఖరి.. వైయ‌స్ జగన్ కు ఇవి చేతకావు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదరికం 11 నుంచి 5 శాతానికి తగ్గించటంలో పేదల పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది..

కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినా.. వనరులను పేదలకు పంచి పెట్టడం వల్లే రాష్ర్టంలో ఆర్ధిక వ్యవస్థ నిలబడింది అని అన్నారు. దాదాపు మూడు లక్షల కోట్లు నేరుగా డీబీటీ రూపంలో ప్రజలకు అందించారు అని పేర్కొన్నారు. అవినీతికి తావులేకుండా, అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వం అందించిందని సజ్జల తెలియచేసారు.ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆస్పత్రులు ఇలా అన్నీ అందుబాటులోకి తెచ్చారు. అన్నీ కళ్ళ ెఎదుట కనిపిస్తున్నాయని తెలిపారు.

టిడిపి హయాంలోలాగా జన్మభూమి కమిటిల వేధింపులు లేవు అని సజ్జల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. వైయ‌స్ జగన్ పాలనలోనే ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లభిస్తున్నాయని అన్నారు. ఎన్నికలు రానున్న తరణంలో మారీచ శక్తులు కలిసి వస్తున్నాయి.. ప్రజలకు చంద్రబాబు చేసింది మోసమే. ఇంటికి వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ ను బలవంతంగా తీసుకుని వచ్చారు.. వైయ‌స్ జగన్ ను గద్దె దించటం పవన్ కళ్యాణ్ ఏకైక లక్ష్యం.. ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూస్తున్నారు.. అందరూ అప్రమత్తంగా ఉండాలి అని కార్యకర్తలకు,ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. పేదల జీవితాల్లో మార్పు కోసం చేస్తున్న యజ్ఞం కొనసాగాలంటే మళ్లీ వైయ‌స్ జగన్ ప్రభుత్వం రావాలి అని అన్నారు.

రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిపాలన తీరు ప్రజలందరి ప్రశంసలు పొందుతోందన్నారు. రాష్ర్టంలో చేపట్టిన కార్యక్రమాలను,పధకాలను పలువురు ఇతర రాష్ట్రాల నేతలు వారి రాష్ర్టాలలో అమలు చేస్తున్నారని ఇది రాష్ర్టానికి గర్వకారణం అన్నారు.రాష్ర్టంలో సంక్షేమ కార్యక్రమాల వలన ప్రతి కుటుంబం లబ్ది పొందిందని అన్నారు. వైయస్ జగన్ పరిపాలన మరింతకాలం సాగాలని ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారని తెలియచేశారు.

సీఎం వైయ‌స్‌ జగన్‌ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రా­లతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎ­త్తున సేవా కార్యక్రమాలను వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు చేపట్టాయని శాసనమండలిలో ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి పేర్కొన్నారు.ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియో­జకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్న­దానం, వస్త్రదానాలు చేస్తున్నారని వివరించారు.

కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధులు నారమల్లి పద్మజ,నారాయణమూర్తి, రవిచంద్రారెడ్డి, కాకుమాను రాజశేఖర్,ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకరరావు ,చల్లా మధుసుధన్ రెడ్డి, ఉత్తర అమెరికాలో రాష్ర్ట ప్రభుత్వ ప్రతినిధి పండుగాయల రత్నాకర్,ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ లు కనకరావు మాదిగ, అమ్మాజీ,పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర రెడ్డి,జేసఎస్ జోన్ కన్వీనర్ పుత్తాప్రతాపరెడ్డి ,పార్టీ విద్యార్ది విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య,దివ్యాంగుల విభాగం ఛైర్మన్ బందెల కిరణ్, తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE