Suryaa.co.in

Andhra Pradesh

పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణకు ప్రత్యేక జీవో విడుదల చేయాలి

ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ

అమరావతి: ఏపీలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియకు పదోన్నతుల్లో తక్షణమే జీవో విడుదల చేయాలని ఏపీ జెఏసీ జోనల్ చైర్మన్ జొన్నకూటి వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అమరావతిలోని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామినీ కలిసి ఉద్యోగ సంఘ నాయకులు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు కొడమంచిలి సత్యనారాయణ మాట్లాడుతూ ఏపీలో ఎస్సీ రిజర్వేషన్ వర్తింప చేసేందుకు విడుదల చేసిన గజిట్లో పదోన్నతి ప్రక్రియలో రిజర్వేషన్ అమలు చేయాలని ఉంది కానీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్.46లు పదోన్నతి ప్రక్రియను మరిచారన్నారు.

దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది ఉద్యోగులు పదోన్నతిలో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియపై రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన చేసి బుధవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాల రావుతో పలువురు మంత్రుల ఓఎస్డీలకు వినతి పత్రాలు ఇవ్వటం జరిగిందనీ ఉపాధ్యాయ నాయకుడు దున్న దుర్గారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు బొల్లిపో మధు శేఖర్, ముప్పిడి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE