జీతాలు, పెన్షన్లు ఇవ్వలేక అప్పులు పుట్టని దీనస్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తక్షణం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్రభుతాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు .రెండేళ్లుగా వచ్చే ఆదాయాన్నంతా నవరత్నాల అమలుకోసం పప్పుబెల్లాల్లా పంచుకుంటూ పోతూ ఒక్క ఇటుకను పేర్చకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. పక్క అభివృద్ధి అనే మాటే వినబడకుండా ఉంటే చేసిన అప్పులు ఏమౌతున్నాయో అనేది అంతుబట్టని రహస్యంగా మారిపోయిందన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వలేకుంటే, మరోపక్క రిజర్వుబ్యాంకు అప్పులు ఇవ్వని పరిస్థితి ఏర్పడటం ఆర్థిక సంక్షోభాన్ని తలపిస్తోందన్నారు. లాక్ డౌన్ కాలంలో సైతం కేంద్రం రాష్ట్రానికి పెద్దఎత్తున వైద్యసహాయం, ఆర్ధిక సహాయం చేసిందని చెప్పారు పంచాయతీలకు పెద్దఎత్తున నిధులు విడుదలచేసి గ్రామీణాభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్నారు. అలాగే లక్షల కోట్ల నిధులతో ఇళ్ల నిర్మాణం, రహదారులు, పోర్టుల అనుసంధానం, స్మార్ట్ సిటీలు, పారిశ్రామిక కారిడార్లు విద్యుత్, మంచినీరు, పారిశుధ్యం, విద్యాసంస్థలు, ప్రభుత్వాసుపత్రుల నిర్మాణానికి చేస్తున్న పనులన్నీ కేంద్రం ఇచ్చే నిధులతో జరుగుతుండగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆదాయంతో పాటు తెచ్చిన అప్పల్లో రూపాయి కూడా అభివృద్ధికి ఖర్చుచేయకుండా సంక్షేమానికే కేటాయించడం వల్ల ఆర్ధిక క్రమశిక్షణ గాడి తప్పిందని గుర్తుచేశారు. ఇలాంటి ఆర్ధిక సంక్షోభం చరిత్రలో చూడలేదని తక్షణం పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి పై శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేశారు.
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…