Suryaa.co.in

Andhra Pradesh

జూన్ 4 తర్వాత వైసీపీ నేతలంతా విదేశాలకు పారిపోవడం పక్కా

-ఎదుటివారిపై తప్పును నెట్టడం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య
-ఎన్నికల రోజు ఓటర్లు, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి సిగ్గు లేకుండా టీడీపీపై తప్పుడు ఆరోపణలా?
– మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయని వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ప్రశాంతంగా ఉన్న పల్నాడును వైసీపీ నేతలు వల్లకాడు చేశారు. కొంతమంది పోలీసు అధికారులతో వైసీపీ నేతలు కుమ్మకై మా కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చేసి విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు ఏమి లేనట్లు సిగ్గు లేకుండా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై అబాండాలు మోపుతున్నారు.

ఎవరు ఎవరిపై దాడి చేశారో వీడియోలు లేవా, స్థానిక ప్రజలు చెప్పడం లేదా..! ఐదేళ్ల నుంచి వైసీపీ రౌడీలు, గూండాలు చెలరేగిపోతున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోతున్నామన్న అక్కసుతో దాడులతో చెలరేగిపోయారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఓటర్లను భయబ్రాంతులకు గురి చేశారు. అయినా ప్రజలు వైసీపీని, జగన్నాసురుడిని ఓడించాలనే కసితో అర్థరాత్రి వరకు క్యూలో వేచి ఓటు వేశారు. ఓటమిని గ్రహించిన వైసీపీ నేతలు సాకులు చెప్పుకుంటూ ప్రతిపక్షాలు, పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

ఎల్లకాలం అబద్దాలు, తప్పుడు ఆరోపణలతో ప్రజలను మోసం చేయలేరు అనే సంగతిని గ్రహించి ఇకనైనా వైసీపీ నేతలు బుద్ది తెచ్చుకోవాలి. ఇక వైసీపీకి ఓటమి తథ్యమని వైసీపీ నేతలు తెలుసుకున్నారు. అందుకే ఒక్కక్కరు ఒకో దేశానికి పారిపోతున్నారు. జూన్ 4 తర్వాత మిగిలిన వైసీపీ నేతలు కూడా రాష్ట్రం విడిచి పారిపోవడం ఖాయం.

 

LEAVE A RESPONSE