కేంద్రం ఇచ్చిన అప్పుల జాబితా అంతా కాపీ పేస్ట్

– కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు పార్లమెంటు సేకరించలేదు
– వాస్తవంగా ఉన్న అప్పెంతంటే… 8 లక్షల 50 వేల కోట్లు
– అసలు గణాంకాలను బయట పెట్టాలి
– సాక్షి పత్రికకు విలువలు, విశ్వసనీయత లేవు
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి

ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువగా ఉన్నాయని నిన్న సాయంత్రం నుండి వైసీపీవారు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాలు చేసుకోవడంలో అర్థంలేదు. ఏపీ ప్రభుత్వం తక్కువ అప్పులు చేసిందని పార్లమెంటులో చెప్పడం పార్లమెంటు పూర్తిగా డేటా సేకరించకపోవడమే. ఆర్బీఐ ఇచ్చిన డేటా ప్రకారం వివరాలు ఇస్తున్నాము అని పార్లమెంటులో ప్రకటించారు. ఇచ్చినా దాన్ని పత్రికల్లో ప్రచురించలేదు.

సాక్షిలో ‘దుష్ట చతుష్టయం దొంగ లెక్కలు’ అని పెద్ద హెడ్డింగ్ తో వార్త ప్రచురించుకున్నారు. వీరు పత్రికా విలువలను ఏరోజుకూడా పాటించారు. సాక్షి పత్రికకు విలువలు, విశ్వసనీయత లేవు. పార్లమెంటులో వచ్చిన సమాధానమేంటి? వీరు పత్రికలోరాసిందేంటి? ఏపీ చేసిన అప్పులపై పార్లమెంటుకు పూర్తి సమాచారం రాలేదు. మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం ఒకలక్షా 30 వేల కోట్లే అని రాసుకోవడం తప్పు. తప్పుడు రాతలు రాసిందికాక అవతలవారిపైన నిందలా? వివిధ రాష్ట్రాలు చేసిన అప్పులెంతెంత? అని పార్లమెంటులో వచ్చిన ప్రశ్నకు పార్లమెంటులో సమాధానమైతే చెప్పారు గానీ పూర్తి సమాచారం చెప్పలేదు.

పార్లమెంటులో నిన్న ఇచ్చిన డేటాలో ఏపీ చేసిన అప్పులు క్లియర్ గా లేవు. ప్రతి సంవత్సరం ఫైనాన్స్ ఇయర్ అయిపోగానే ఆర్బీఐ వారు స్టడీ ఆఫ్ బడ్జెట్ అని స్టడీ చేసి ఒక రిపోర్టు తయారు చేస్తారు. దాన్ని ఆర్బీఐ బులిటెన్ లో రిలీజ్ చేస్తారు. ఆర్బీఐ బులిటెన్ విడుదల చేసిన డేటాని కాపీ చేసి, పార్లమెంటులో సబ్ మిట్ చేశారు. చేసిన అప్పుల వివరాలను రాష్ట్రాలను అడిగి సమాచారం సేకరించాల్సివుండగా పార్లమెంటు రాష్ట్రాలను అడగలేదు. ఆర్బీఐ లో బులిటెన్ ను కాపీ చేసి పార్లమెంటులో సబ్ మిట్ చేశారు.

మినిష్టర్ ఫైనాన్స్ వారు కాగ్ వారు ఆడిట్ జరిగిన తరువాత మినిష్టర్ ఆఫ్ ఫైనాన్స్ వారికి ఒరిజనల్ డేటా వెళ్తుంది. ఆర్బీఐ మంత్రి ఇండికేటర్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా వెళ్తుంది. రాష్ట్రప్రభుత్వాలు 2021నుండి 22వరకు కేవలం బడ్జెట్ డేటా మాత్రమే ఇచ్చారు. నాలుగు రకాల అప్పులుంటాయి. ఆర్బీఐ ద్వారా తెచ్చుకునే రుణాలు, వివిధ రకాల ప్రభుత్వ సంస్థల ద్వారా తెచ్చుకునే రుణాలు. ఈ డేటా ఆర్బీఐ దగ్గర ఉండదు. ఆర్బీఐ దగ్గర ఉండే డేటాను మాత్రమే పార్లమెంట్ తీసుకుంది.

ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు కూడా ఉంటాయి. వాటి వివరాలు పార్లమెంటు సేకరించలేదు. వివిధ రకాల యూనివర్శిటీల వద్ద, పంచాయతీల వద్ద, జీపీఎస్ లవద్ద తీసుకునే అప్పుల డేటాను పార్లమెంటు సేకరించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయిస్ కు ఇవ్వాల్సిన డ్యూస్ 15వేలు పెండింగ్ లో ఉన్నాయి. కాంట్రాక్టర్లకు లక్షా 30 వేల కోట్లు కాంట్రాక్టర్లకు అప్పు ఉంది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు వారికి, సప్లయర్స్ కు ఇవాల్సిన బిల్లులు, సర్వీస్ ప్రొవైడర్స్ బిల్లులు పెండింగ్ ఉంది. ఇవన్నీ లక్షా 50 వేల పైచిలుకు పెండింగ్ లో ఉంది.

కార్పొరేషన్ బిల్లులు, వీఏపీ బిల్లులు పార్లమెంటు ఇచ్చిన నివేదికలో కవర్ అవలేదు. ఆర్బీఐ వద్ద కేవలం మంత్లీ మంత్లీ బాండ్స్ రైజ్ చేసిన డేటా మాత్రమే ఉంటుంది. అదికూడా రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ చేయాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా మేం 2022 మార్చికి కేవలం 3,98,903 కోట్లే అప్పు చేశాం, అందులో 2019 నుంచి ఇప్పటిదాక చేసింది లక్షా 30 వేల కోట్లే అంటే ఎవరు నమ్ముతారు? దాన్ని తాటికాయంత అక్షరాలతో సాక్షి పత్రికలో రాసుకొని సంబరపడిపోతున్నారు.

వాస్తవంగా ఉన్న అప్పెంతంటే… 8 లక్షల 50 వేల కోట్లు. ఇదంతా అప్పు కాదా? ఇదంతా ఎవరు కడతారు? జగన్ కడతారా?, బుగ్గన రాజేంద్రనాథ్ కడతారా? మా ప్రభుత్వం వచ్చాక ఇంతే కట్టమంటారా? 3,98,903 కోట్లే కట్టమంటారా? రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఉన్న అప్పు కట్టమని అడుగుతారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పును కూడా ప్రభుత్వం చెల్లించమని అడుగుతారు. బయటికి వచ్చిన అప్పు లక్షా 50 వేల పైచిలుకే ఉంది. ఇంకా దాచిన అప్పులు ఎన్ని ఉన్నాయో తెలియదు. లిక్కర్ బాండ్స్ ద్వారా తెచ్చిన అప్పు, నాబార్డు, వరల్డ్ బ్యాంకు ద్వారా తెచ్చిన అప్పు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అప్పులు కట్టాల్సి ఉన్నాయి. 3,98,903 కోట్లే అప్పులున్నాయని సీఎం, బుగ్గన రాసివ్వగరా? దీనికి మించి వచ్చే ప్రభుత్వాన్ని అడగొద్దు, ఏమున్నా మమ్మల్యే అడగండి అని రాసివ్వగలరా?

నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో 31మార్చిన రాసిన లేఖలో మొత్తం డబ్బును ఎఫ్.ఆర్.బి నుంచి సమకూరుస్తాము అని చెప్పారు. తరువాత రెండళ్ళకని, నాలుగేళ్ళకని మార్చుకుంటు వచ్చారు ఈ సంవత్సరం నుంచి కట్ చేస్తామన్నారు. గతంలో 2020-2021లో కార్పొరేషన్లో చేసిన అప్పులని మాఫీ చేస్తామని చెప్పారు. నాలుగు నెలలోనే నాలుగు సార్లు మాట మారుస్తారా? ఇలా మాట మారుస్తుంటే రాష్ట్రాలకు ఆర్థిక క్రమశిక్షణ ఉంటుందా. మీ తీరు రాష్ట్రాలను హెచ్చరిస్తున్నట్టా, సహకరిస్తున్నట్టా? పత్రికలకు కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది అని ప్రచురించుకుంటున్నారు, హెచ్చరించే తీరు ఇదేనా.

అప్పులలో రాష్ట్రం 8వ స్థానంలో ఉందని వైసీపీ దినపత్రికలలో ప్రచురించింది, మార్చి గణాంకాలను బయట పెట్టుంటే ఎన్నో స్థానం అనేది తెలిసేది. దొంగ లెక్కలను సమర్పించి స్థానాలను తక్కువగా చూపించి చెప్పుకుంటున్నారు. అసలు గణాంకాలను బయట పెట్టాలి. తాము నిజాలను బయట పెడితే మేము విలువ లేని వాళ్లమని, దుష్ ప్రచారం చేస్తున్నామని అభియోగాలు మోపుతున్నారు.

కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది మరో శ్రీలంకలా మారే పరిస్థితులు వస్తున్నాయని అంటూనే మరోపక్క మాట మార్చి మాట్లాడుతున్నారు. వారి చెప్పిన మాటలకు వారే కట్టుబడి ఉండరు అనేది అర్థమవుతుంది.

8లక్షల 50వేల కోట్ల రూపాయలు అప్పులు ఉంటే లక్షా 70వేల రూపాయల తలసరి అప్పు ప్రతి మనిషి మీద పడుతుంది. అందుకే మేం పదే పదే రాష్ట్రం శ్రీలంకని మించిపోయింది అని హెచ్చరిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం కూడ ఈ విధంగా సహకరిస్తుంటే రాష్ట్రం విచ్చలవిడిగా అప్పులు చేయరా?

రాష్ట్రం అప్పులలో కూరుకుపోతే ఆర్టికల్ 360 పెట్టి అందరి నోట్లో మట్టికొడతారు. అప్పుడు సంక్షేమ పథకాలు ఏమీ ఉండవు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వమే ఎఫ్.ఆర్.బి.ఎమ్. నిబంధనలు కింద రాసిన లేఖ ప్రకారం 28వేల కోట్ల రూపాయలు, కాని నాలుగు నెలలో మీరు అనుమతించిన అప్పు 38వేల 190కోట్ల రూపాయలు. అందులో 8వేల 3వందల కోట్ల రూపాయలకు రాజ్యాంగ ఉల్లంఘన ఆర్టికల్ 266 జరిగింది. లిక్కర్ పై 8వేల 3వందల కోట్ల రూపాయలు ఎలా తెస్తారు? రాష్ట్రంలో ఉద్యోగులు దాచుకున్న డబ్బుని లిక్కర్ లో పెట్టుబడి ఎలా పెడతారు?కేంద్రం కూడ అంత వ్యవస్థని పెట్టుకొని కాపీ పేస్ట్ డేటాని ఇవ్వడం దురదృష్టకరమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply