Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో కూటమిదే గెలుపు

నా కోసం వచ్చిన లోకేష్‌కు ధ్యాంక్స్
– తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ అభ్యర్ధి అన్నామలై
-అన్నామలైను అత్యధిక మెజారిటీతో గెలిపించండి
– కోయంబత్తూరు తెలుగువారికి లోకేష్ పిలుపు
– కోయంబత్తూరు లోకేష్ సభకు పోటెత్తిన తెలుగువారు
– తెలుగుసంఘాల సంఘీభావం
– జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారి మరొక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసిన లోకేష్
– కోయంబత్తూరులో బిజెపి ఎంపి అభ్యర్థి అన్నామలై తో కలసి ప్రచారంలో పాల్గొన్న జాతీయ కార్యదర్శి నారా లోకేష్

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ అభ్యర్ధి అన్నామలై విజయం కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోయంబత్తూరు వెళ్లారు. అక్కడి తెలుగువారిని అన్నామలైకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధించారు. కాగా లోకేష్ సభకు కోయంబత్తూరు తెలుగువారు పోటెత్తారు. అన్నామలైను గెలిపిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగువారు లోకేష్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. స్థానిక తెలుగు అసోసియేషన్ సంఘాలు కూడా లోకేష్‌ను కలిసి, ఎన్డీఏకు ఓటేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో మరొక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఇదే ప్రథమం.

ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్ధి అన్నామలై ఏమన్నారంటే… ప్రపంచం దేశాల నుండి కంపెనీలు తెచ్చి హైదరాబాదును ఐటి రంగంలో అంతర్జాతీయ స్ధాయిలో అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది. ఏపీ లో టిడిపి,జనసేన, బిజెపి కలసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఏపీ లో కూటమి గెలుపును ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలింది.

తమిళనాడులో డిఎమ్‌కె చేస్తున్నట్లుగానే, ఏపీ లోను అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అన్యాయంగా అక్కడి పార్టీ అరెస్టు చేసింది ఇప్పుడు ఏపీ ప్రజలు అందరూ కూటమి వైపు చూస్తున్నారు. ఏపీ రానున్న రోజుల్లో అభివృద్ధిలో దూసుకుని వెళు తుంది . దాన్ని మనం కళ్ళారా చూస్తాము. అలానే కోయంబత్తూరు ఇక్కడ అభివృద్ది చెందుతుంది.

కోయంబత్తూరు లో ఉన్న తెలుగు ప్రజల కోసం నారా లోకేష్ వచ్చారు. నా గెలుపు కోసం వచ్చిన లోకేష్ కు ధన్యవాదాలు. అన్నామలై ఎంపి అయితే కోయంబత్తూరు అభివృద్ధి చెందుతుందని తెలుగు వారికి చెప్పడానికి లోకేష్ వచ్చారు. తమిళనాడులో ఊహించని విధంగా బిజెపి కూటమి గెలుస్తుంది.

LEAVE A RESPONSE