Suryaa.co.in

Andhra Pradesh

కోనసీమలో చమురు శుద్ధి కర్మాగారం కావాలి

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటిని కలిసిన గ్యాస్ సాధన సమితి
కోనసీమ ప్రాంతంలో చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలని కృష్ణా గోదావరి బేసిన్ చమురు గ్యాస్ సాధన సమితి బిజెపి కీ విజ్ఞప్తి చేసింది. బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ని కలసి సాధన సమితి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.

సహజవనరులు అధికంగా ఉన్న కృష్ణా గోదావరి బేసిన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సాధన సమితి కోరింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారి ని కలసి నా వారి లో సాధన సమితి ప్రతినిధులు డాక్టర్ కొల్లా రాజమోహన్,పివి ఎం రావు,అవధానుల హరి తదితరులు ఉన్నారు

LEAVE A RESPONSE