Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగు

ప్రభుత్వ విద్యార్థులకు అందుబాటులోకి ఐబీ సిలబస్‌
అంతర్జాతీయంగా ప్రభుత్వ బడి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మరో అడుగు
ఐబీ సిలబస్‌ ప్రవేశంపై ఇప్పటికే మార్గదర్శక ప్రణాళిక తయారీకి సీఎం ఆదేశాలు

ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టే నిర్ణయానికి ఇవాళే ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం.
మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఐబీ సంస్థతో ఎంఓయూ కార్యక్రమం.
సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐబీ సంస్ధతో రాష్ట్ర ప్రభుత్వం ఏంఓయూ కార్యక్రమం.
ఎంఓయూపై సంతకాలు చేసిన ఐబీ చీఫ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ మాట్‌ కాస్టెల్లో, విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌.
సింగపూర్, వాషింగ్టన్‌ డీసీ, జెనీవా, యూకేల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఐబీ ప్రతినిధులు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఐబీ డైరెక్టర్‌ జనరల్‌ Olli-Pekka Heinonen
ఎంఓయూ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన ఐబీ చీఫ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, Matt Costello.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ ఏమన్నారంటే…:
ఐబీ ప్రతినిధులకు నా ప్రగాఢ ధన్యవాదాలు. విద్యలో నాణ్యతను పెంచడమే ప్రధాన లక్ష్యం. మా పిల్లలను ప్రపంచంలో అత్యుత్తమ విద్యార్థులగా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం. అందుకోసమే మీ సహకారాన్ని కోరుతున్నాం.

ఇక్కడ విద్యార్థులు సంపాదించే సర్టిఫికెట్‌ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా ఉండాలన్నది ఉద్దేశం. మరే ఇతర ఐబీ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌తో అయినా సరిసమానంగా ఉండాలి. అట్టడున ఉన్న విద్యార్ధులకు దీన్ని అందించడమే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అతిపెద్ద విజయం. ఐబీ సిలబస్‌ అన్నది సవాల్‌తో కూడుకున్నది.

అందులోనూ ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టడం అన్నది అటు మీకు మాక్కూడా సవాల్‌తో కూడుకున్నది. కాని సంకల్పం ఉంటే సాధ్యంకానిది లేదు.

పాఠశాల విద్యను బలోపేతంచేయడానికి మేం ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాం. అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. పాఠశాల విద్యను అత్యంత నాణ్యంగా తీర్చిదిద్దాం. స్కూళ్లను బాగుచేయడం దగ్గరనుంచి… తరగతిగదుల డిజిటిలైజేషన్‌ వరకూ అనేక చర్యలు తీసుకున్నాం. 6వ తరగతి నుంచి అన్ని తరగతిగదులనూ డిజిటలైజేషన్‌ చేస్తున్నాం. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేశాం. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబులు పంపిణీ చేశాం. పిల్లలందరికీ బైలింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ తీసుకు వచ్చాం.
పిల్లాడిని స్కూలుకు పంపే తల్లికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం.

టోఫెల్‌ పరీక్షల్లో శిక్షణ ఇస్తున్నాం. టోఫెల్‌ ప్రైమరీ, ఆ తర్వాత టోఫెల్‌ జూనియర్, టోఫెల్‌ సీనియర్‌ విభాగాలుగా వీటిని విద్యావ్యవస్ధలో భాగం చేశాం. ప్రతిరోజూ ఒక పీరియడ్‌ టోఫెల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నాం. దీనివల్ల ఈ వయస్సులో పిల్లలకు గుర్తుండిపోతుంది.

అన్ని స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంలో బోధిస్తున్నాం. విద్యాప్రమాణాలను పెంచడానికి అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగానే ఐబీని తీసుకు వచ్చాం. మీ సహకారంతో దీన్ని చేపడుతున్నాం. ఇది ఒక రోజుతో సాధ్యం అయ్యేది కాదు.

ఒకటో క్లాసుతో ఇవాళ మొదలు పెడితే దీని ఫలితాలు పదేళ్ల తర్వాత కనిపిస్తాయి. ఏడాదికి ఒక్కో తరగతిపెంచుకుంటూ పోవాలి. ఇలా చూసుకుంటే పూర్తిస్థాయిలో రావడానికి పదేళ్లు పడుతుంది. దిగువస్థాయిలో ఉన్న పేదల వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే మా ఉద్దేశం. దేవుడి దయ వల్ల ఈ లక్ష్యం సిద్ధిస్తుంది. దీంట్లో ఐబీ భాగస్వామ్యానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌, పాఠశాల విద్యాశాఖ కమషనర్‌ ఎస్ సురేష్ కుమార్‌, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్పన) కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, ఇతర ఉన్నతాధికారులు, ఐబీ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్‌ మేనేజర్‌(సౌత్ ఏసియా) మహేష్‌ బాలకృష్ణన్‌, ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ matt costello, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌ dr.anton beguin పాల్గొన్నారు.

LEAVE A RESPONSE