Suryaa.co.in

Telangana

దేశంలో మోదీ వ్యతిరేక పవనాలు

-కాంగ్రెస్‌ 100 రోజుల పాలనకు రెఫరెండం
-ఈ ఎన్నికల్లో అసెంబ్లీ కన్నా మించి ఓట్ల శాతం

-వాషింగ్‌ మెషిన్‌లో చేరగానే అవినీతి పోయిందా?
-కేసీఆర్‌ మాటలు కేఏ పాల్‌ను మించాయి
-కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయి. ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబు తోంది. సెప్టెంబర్‌ 17, 2025తో మోదీ 75 ఏళ్లు నిండుతాయి. ఏజ్‌ లిమిట్‌ అమలు చేస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ తేల్చుకోవాలి. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోతే బీజేపీ, ఎన్డీఏకు దేశం లో మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది.. 400 సీట్లు ఎట్లా సాధ్యం? అని ప్రశ్నించారు.

దేశంలో మోదీ వ్యతిరేక వేవ్‌..
13 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు పీఎంగా పనిచేసిన మోదీ మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు. సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడం లేదు. దేశ ప్రజలకు మోదీ మాయమాటలు చెబుతున్నారు. ఇండియా కూటమి పేరుతో మేం ప్రజలను ఓట్లు అడుగుతుంటే మోదీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది. ఎవరు నామ్‌ దార్‌.. ఎవరు కామ్‌ దార్‌ దీన్ని బట్టి తెలుస్తోంది. ఎవరు అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నారో చర్చకు సిద్ధం. దేశంలో మోదీ వ్యతిరేక వేవ్‌ నడుస్తోందన్నారు.

వాషింగ్‌ మెషిన్‌లో చేరగానే అవినీతి పోయిందా?
మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు లేవు… నవనీత్‌ కౌర్‌ 15 సెకన్ల కామెంట్స్‌పై చర్యలు లేవు. బీజేపీ నేతలపై ఎంహెచ్‌ఏ ఫిర్యాదు చేయదు..కానీ, ఒక వీడియో వైరల్‌ కేసులో మాపై ఎంహెచ్‌ఏ రంగంలోకి దిగింది. ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది నిదర్శనం. బీజేపీ వాషింగ్‌ మెషిన్‌లో చేరగానే కొందరు నాయకుల అవినీతి మరకలు తొలగిపోయాయా? కాంగ్రెస్‌కు ఆదాని, అంబానీ డబ్బులు ఇస్తున్నా రన్న మోదీని ఒక్కటే అడుగుతున్నా. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు నిర్వహించండి. మోదీ ఆరోప ణలు నిజమైతే ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు. రైతుబంధు ఎలా ఇచ్చా మో.. పంద్రాగస్టు లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం. రుణమాఫీ అసాధ్యమైన టాస్క్‌ కాదు. పార్లమెంట్‌ ఎన్నికలు మా వంద రోజుల పాలనకు రెఫరెండం. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి పెట్టుబడులు గుజరాత్‌కు తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తోంది. యూపీ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. కేసీఆర్‌పై నాకు సానుభూతి ఉంది.. మానసిక ఒత్తిడి, నిరాశ, భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారు. కేసీఆర్‌ కూడా కేఏ పాల్‌లాగే మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE