– పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు
– రెడ్డి సామాజికవర్గానికి పెద్దపీట
అమరావతి: కూటమి ప్రభుత్వం మరికొన్ని నామినేటెడ్ పదదవులు ప్రకటించింది. డిసిసిబి, పలు సంఘాల చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ జాబితాలో రెడ్డి సామాజికవర్గానికి పెద్ద పీట వేయడం ప్రస్తావనార్హం. ఫలితంగా ఆ సామాజికవర్గాన్ని సీఎం చంద్రబాబునాయుడు మెప్పించినట్లయింది.
-శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్ గా శివ్వల సూర్యనారాయణ(టీడీపీ)
– విశాఖ డీసీసీబీ ఛైర్మన్గా కోన తాతారావు(జనసేన)
– విజయనగరం డీసీసీబీ ఛైర్మన్గా కిమిడి నాగార్జున(టీడీపీ)
– గుంటూరు డీసీసీబీ ఛైర్మన్గా మాకినేని మల్లికార్జునరావు(టీడీపీ)
– కృష్ణా డీసీసీబీ ఛైర్మన్గా నెట్టెం రఘురామ్(టీడీపీ)
– నెల్లూరు డీసీసీబీ ఛైర్మన్గా ధనుంజయరెడ్డి(టీడీపీ)
– చిత్తూరు డీసీసీబీ ఛైర్మన్గా అమాస రాజశేఖర్ రెడ్డి(టీడీపీ)
– అనంతపురం డీసీసీబీ ఛైర్మన్గా కేశవరెడ్డి(టీడీపీ)
– కర్నూలు డీసీసీబీ ఛైర్మన్గా డి.విష్ణువర్ధన్ రెడ్డి(టీడీపీ)
– కడప డీసీసీబీ ఛైర్మన్గా బి.సూర్యనారాయణరెడ్ది(టీడీపీ)
-శ్రీకాకుళం డీసీఎంస్ ఛైర్మన్గా అవినాష్ చౌదరి(టీడీపీ)
– విశాఖ డీసీఎంస్ ఛైర్మన్గా కొట్ని బాలాజీ(టీడీపీ)
– విజయనగరం డీసీఎంస్ ఛైర్మన్గా గొంప కృష్ణ(టీడీపీ)
– గుంటూరు డీసీఎంఎస్ ఛైర్మన్గా వడ్రాణం హరిబాబు(టీడీపీ)
– కృష్ణా డీసీఎంస్ ఛైర్మన్గా బండి రామకృష్ణ(జనసేన)
– నెల్లూరు డీసీఎంస్ ఛైర్మన్గా గొనుగోడు నాగేశ్వరరావు(టీడీపీ)
– చిత్తూరు డీసీఎంస్ ఛైర్మన్గా సుబ్రమణ్యంనాయుడు(టీడీపీ)
– అనంతపురం డీసీఎంస్ ఛైర్మన్గా నెట్టెం వెంకటేశ్వర్లు(టీడీపీ)
– కర్నూలు డీసీఎంస్ ఛైర్మన్గా జి.నాగేశ్వరయాదవ్(టీడీపీ)
– కడప డీసీఎంస్ ఛైర్మన్గా యర్రగుండ్ల జయప్రకాశ్(టీడీపీ)