Suryaa.co.in

Telangana

ఏఎస్ఐ ఉమాదేవిపై వేటు

– బీజేపీ అభ్యర్థి మాధవీలతకు హగ్

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కొందరి ప్రవర్తన, వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వారిపై కేసులు నమోదవు తున్నాయి. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఘటనలో సైదాబాద్ ఏఎస్ఐ ఉమా దేవిపై వేటు పడింది. ఆమె ను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రచారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతను, ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడి యాలో వైరల్ కావడంతో చర్యలు తీసుకున్నారు.

LEAVE A RESPONSE