Suryaa.co.in

Andhra Pradesh

ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలబడాలి

-ఐదేళ్ల విధ్వంసంపై గళం విప్పాలి
– జగన్‌ అరాచకాలపై జనంలో చైతన్యం తేవాలి
-దోపిడీ, విధ్వంస పాలనపై విస్తృత చర్చ జరగాలి
-ఇన్‌ఫ్లూయెన్సర్లతో సమావేశంలో చంద్రబాబు పిలుపు
-‘బాబును మళ్లీ రప్పిద్దాం’ కార్యక్రమానికి శ్రీకారం

మంగళగిరి: ఎన్నికల సమరానికి ఇక కేవలం 20 రోజులు మాత్రమే ఉంది…ఈ ఇరవై రోజులు పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా శ్రమించాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ‘బాబును మళ్లీ రప్పిద్దాం’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఇన్‌ఫ్లూయెన్సర్లతో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్ల జగన్‌ అరాచక పాలనపై పెద్దఎత్తున ప్రజలను చైతన్యం చేయాలని, జనసమూహాలు అధికంగా ఉండే మార్కెట్‌ సెంటర్లు, బస్టాండ్లు, సినిమాహాళ్లు తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు జగన్‌ విధ్వంస పాలన గురించి వివరించాలన్నారు. దేశంలోనే అతిపెద్ద దోపిడీదారుడైన జగన్‌ను పోల్చాలంటే మరో కొత్త పదాన్ని కనిపెట్టాలి. రాబోయే ఎన్నికల్లో ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలబడాలి. రాష్ట్రాన్ని వైసీపీ రహిత రాష్ట్రంగా మార్చాలని పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డి బటన్‌ నొక్కానని డబ్బా కొట్టుకుంటున్నాడు. బటన్‌ నొక్కడానికి జగనే అవసరం లేదు. ఐదేళ్లుగా ప్రజలపై పన్నులు, చార్జీల బాదుడును నిర్విరామంగా కొనసాగించారు. విధ్వంసానికి మారుపేరే జగన్‌. పోలవరం, అమరావతిని విధ్వంసం చేశాడు, ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ను దెబ్బతీశాడు. వీటన్నిం టిపై ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు.

ఎర్రచందనం స్మగ్లర్లకు జగన్‌ టికెట్లు
రాష్ట్రంలో జగన్‌ పంచభూతాలను కూడా వదల్లేదు. జగన్‌ రెడ్డి ఇసుక మాఫియా కారణంగా రాష్ట్రంలో భూగర్భజలాలు అడుగంటిపోయే పరిస్థితి నెలకొంది. ఇష్టారాజ్యంగా ఇసుక తోడేయడంతో నదులకు ఇరువైపులా ఉండే పంట పొలాలు నాశనం అవుతాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో నదుల మనుగడ కోసం చెక్‌డ్యాంలు నిర్మిస్తే నేడు విధ్వంసం చేస్తున్నారు. ఖనిజ సంపదను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. మంగంపేటలోని బైరైటీస్‌ గనులను మొత్తం ఊడ్చే శారు. ప్రపంచంలోనే నెల్లూరు ప్రాంతంలో అరుదుగా లభించే సిలికాన్‌ ఇష్టారాజ్యంగా తవ్వేశా రు. సిలికా శాండ్‌ను చైనాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెడ్‌ శాండిల్‌ స్మగ్లర్లకు జగన్‌ టికెట్లు ఇస్తున్నాడు. చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిపై 11 ఎర్రచందనం కేసులు ఉన్నాయని ఆయనే తన అఫిడవిట్‌లో రాసుకున్నారు. ఎర్రగంగిరెడ్డి, పెద్దిరెడ్డిలు ఈ కోవకు చెందినవారే. రూ.10 వేల కోట్ల విలువైన లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ భూములను రూ.500 కోట్లకే జగన్‌రెడ్డి తన మేనమామ కొడుక్కి కట్టబెట్టాలని చూశాడు. పర్యావరణ పరిరక్షణ కోసం తెలుగుదేశం హయాంలో నాటిన చెట్లను నేడు జగన్‌రెడ్డి ముఠా నరికి సొమ్ము చేసుకున్నారు. మధ్యనిషేధం చేస్తానని చెప్పిన జగన్‌రెడ్డి ఒకప్పుడు రూ.60 ఉన్న క్వార్టర్‌ బాటిల్‌ను నేడు రూ.200 చేసి పేదల రక్తాన్ని తాగుతున్నాడు. నాసిరకం మధ్యం పోసం 30 వేల మంది ప్రాణాలు బలిగొన్నాడు. 30 లక్షల మంది ఆరోగ్యాలను నాశనం చేశాడు.

రైతులు, కూలీలను నట్టేటముంచారు
జగన్‌ పాలనలో రైతులు, రైతు కూలీలను నట్టేట ముంచాడు. తెలుగుదేశ ప్రభుత్వ హయంలో ‘జీరో బడ్జెట్‌-నేచురల్‌ ఫామింగ్‌’తో తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన తిండి గింజలు పండి చేలా రైతులను ప్రోత్సహించాం. కరువు సీమగా పేరొందిన రాయలసీమలో డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా సిరులు పండిరచేలా చేసి రైతులకు అండగా నిలబడ్డాం. రైతులకు ఆదాయం పెంచాల ని ఎన్టీఆర్‌ కాలం నుంచి వాణిజ్య పంటలను ప్రోత్సహించాం. ఎన్టీఆర్‌ మలేషియా నుంచి పామాయిల్‌ తీసుకొచ్చి రాష్ట్రంలో నాటించారు. నేడు పామాయిల్‌ ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం నెంబర్‌-1గా నిలిచింది. నదుల అనుసంధానం చేసేందుకు ప్రాధాన్యతనిచ్చాం. పట్టిసీమను పూర్తిచేసి 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. తెలుగుదేశం ప్రభుత్వం కృషితో నాడు రాష్ట్రం 14 శాతం వృద్ధి సాధించింది. కానీ, జగన్‌ నేడు రైతు భరోసా కేంద్రాలంటూ రైతు దగా కేంద్రాలుగా మార్చేశాడు. దేశంలో కెల్లా నేడు రాష్ట్రంలో ఎక్కువగా నిరుద్యో గం ఉంది. ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు…పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ లేదు. రాష్ట్రంలో యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. గంజాయి, డ్రగ్స్‌తో యువత భవిత ను నాశనం చేశారు. ఐదేళ్ల జగన్‌ అరాచకాలపై మీరంతా గొంతు విప్పాలి. రాష్ట్రంలో జగన్‌ విధ్వంసం, సమస్యలపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలి. వైకాపా ప్రభుత్వం వల్ల ఒక తరం నష్టపోయిందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE