Suryaa.co.in

ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణ
Andhra Pradesh

ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణ

– దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ కామెంట్స్…
విజయవాడ: భవానీ దీక్షా విరమణలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం.అన్ని శాఖల అధికారులు భవానీ దీక్షల్లో విధులు నిర్వహిస్తారు.ఈ నెల 25 నుంచి 29 వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు.25 న ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నాం.నాలుగు హోమ గుండాలతో పాటు ఇరుముడులను విప్పేందుకు 50 పాయింట్లను ఏర్పాటు చేస్తున్నాం.వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లలో అమ్మవారి దర్శనానికి భవానీలను అనుమతిస్తాం.భవానీలందరికీ డిసెంబర్ 25 నుంచి 29 వరకు అన్ని ఉచిత దర్శనాలు కల్పిస్తున్నాం ..ప్రోటోకాల్ మాత్రం 300 టిక్కెట్ తీసుకోవాల్సిందే. ఈ ఏడాది 5 లక్షల మందికి పైగా భవానీ లు వస్తారని అంచనా వేస్తున్నాం. అందుకు తగ్గ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. దీక్షా విరమణలో భౌతిక దూరం పాటించాలి..ప్రతిఒక్కరూ శానిటైజ్ చేసుకొని మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే.

LEAVE A RESPONSE