Suryaa.co.in

Andhra Pradesh

ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో వైసీపీకి భారీ షాక్

రావి వెంకటరమణ నేతృత్వంలో భారీగా టిడిపిలోకి చేరికలు
యువనేత నారా లోకేష్ సమక్షంలో 50మంది పార్టీలో చేరిక

అమరావతి: ప్రత్తిపాడు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపికి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్యర్యంలో 50మంది ప్రస్తుత సర్పంచ్ లు, ఎంపిటిసిలు, మాజీ జడ్ పిటిసిలు, మాజీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే పార్టీ టిడిపి అని అన్నారు. వారికి ఏ కష్టమొచ్చినా కడుపులో పెట్టుకుని చూసుకుంటామని అన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా వందకోట్లకుపైగా అందించిన ఏకైక పార్టీ టిడిపి మాత్రమేనని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి 70లక్షలమంది పసుపుసైనికులే ఆస్తి అని, తెలుగుజాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తామని అన్నారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా సుభిక్షంగా ఉండాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పసుపుజెండా అంతా ఎగురవేసేందుకు కలసికట్టుగా కృషిచేయాలని కోరారు.

పార్టీలో చేరిన వారిలో ముప్పాళ్ల విశ్వేశ్వరరావు, గింజుపల్లి సుబ్బారావు, కమ్మా నాగమల్లేశ్వరరావు, మదమంచి శ్రీనివాసరావు, యలవర్తి నరసింహరావు, రావిపాటి కృష్ణప్రసాద్, కుర్రా శివనాగేశ్వరరావు, గుంటుపల్లి రవిబాబు, గురజవోలు పద్మావతి, ఘంటా కామేశ్వరరావు, వణుకూరు వీరారెడ్డి, పేరం శ్రీనివాసరావు, మొగిలి భరత్ కుమార్, కొమ్మినేని స్వామి, అరవపల్లి రాంబాబు, ఆరే నరేంద్ర, మద్దినేని శ్రీనివాసరావు, కంచర్ల కోటేశ్వరరావు, నల్లగొర్ల ఓబయ్య, పాటిబండ్ల రాంబాబు, పాగోలు శివకృష్ణ, వేముల శివపార్వతి, పురుషోత్తపట్నం గోకుల్ రావు, దాసరి కుమారస్వామి, అన్నవరపు కృష్ణచైతన్య, షేక్ సుభాని, షేక్ బాషా, షేక్ సూఫియా సుల్తాన్, కొండబోలు బ్రహ్మయ్య, షేక్ మక్బూల్, యామిని శ్రీహరి, ముక్కామల విజయబాబు, బన్నారావూరి శివరామకృష్ణ, షేక్ వాహిదుల్లా, షేక్ మౌలాలి, కంచర్ల మహేష్ పాల్, కటికల చంద్రకుమార్, జొన్నకూటి లక్ష్మీకాంత్, జాస్తి సాంబశివరావు, పిల్లి ప్రసాదరావు, మానుకొండ రవికాంత్, నాగళ్ల శ్రీనివాసరావు, గద్దె కిషోర్, గుండాల ప్రసాద్, సురభి దానయ్య, మోపర్తి శంకర్, రమావత్ హరినాయక్, సందేటి కొండలు, జంగా రాజేష్, కొత్తపల్లి దిలీప్, గూడూరి సాయికృష్ణ, యడ్లపల్లి శేషగిరిరావు తదితరులు ఉన్నారు.

శరత్ కుమార్ రాజు నేతృత్వంలో 40మంది చేరిక
రాజంపేటకు చెందిన సీనియర్ న్యాయవాది, శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్మన్ కొండూరు శరత్ కుమార్ రాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. శరత్ కుమార్ రాజుతో పాటు మరో 40 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ ఉండవల్లిలోని నివాసంలో యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… అయిదేళ్ల జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చంద్రబాబుతో మాత్రమని విశ్వసించి రాష్ట్రవ్యాప్తంగా ఎందరో తటస్థులు టిడిపిలో చేరుతున్నట్లు చెప్పారు.

పెమ్మసాని ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన కీలకనేతలు
గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో పలువురు వైసిపి ప్రముఖులు టిడిపిలో చేరారు. ఉండవల్లి నివాసంలో వారికి యువనేత నారా లోకేష్ పసుపుకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వైఎస్సార్ సిపి రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి సుద్దపల్లి నాగరాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ కార్యదర్శి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్చార్జి కొలకలూరి కిరణ్, గుంటూరు 17వవార్డు బిసి నాయకుడు బండారు గోపీ యాదవ్, తెనాలి 31వవార్డు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు రేపూడి సురేష్ బాబు, 30వవార్డు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు రావూరి అంకమ్మ ఉన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు నూతనంగా చేరిన నేతలు కృషిచేయాలని కోరారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తగిన గుర్తింపునిస్తామని చెప్పారు.

LEAVE A RESPONSE