Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ పార్టీవి శ‌వ రాజ‌కీయాలు

-బీఆర్ఎస్ నేత శ్రీధ‌ర్ రెడ్డి హత్యకు దురాల‌వాట్లు, భూత‌గ‌దాలు, ఆర్థిక లావాదేవీలే కారణం
-శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య‌ను అడ్డం పెట్టుకుని త‌న‌పై బుర‌ద‌జ‌ల్లుతున్నారు
-బీఆర్ఎస్, కేటీఆర్ నీచ రాజ‌కీయాలు ప‌రాకాష్ట‌కు చేరాయి
-ఇక కేటీఆర్ ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు
-ఇక‌నైనా శ‌వ రాజ‌కీయాలు మానండి
-మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

కొల్ల‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం చిన్నంబావి మండ‌లం ల‌క్ష్మిప‌ల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేత శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య‌కు దురాల‌వాట్లు, భూత‌గ‌దాలు, ఆర్థిక లావాదేవీలే కారణమని ఎక్సైజ్, ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌ వ‌ల్ల జ‌రిగిన హ‌త్య‌ను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నాయ‌కులు రాజ‌కీయ హ‌త్య‌గా చిత్రీక‌రించ‌డం దుర్మార్గ‌పు చ‌ర్య అని మంత్రి ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

వ్య‌క్తిగ‌త కార‌ణాలతో హ‌త్య జ‌రిగిన …. రాజ‌కీయ రంగు పులిమి లేనిపోని రాద్దాంతం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హ‌త్య‌కు దారితీసిన ప‌రిస్థితులు, పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని కేటీఆరే చెప్పుతున్నార‌ని, అట్లాంట‌ప్పుడు రాజ‌కీయ హ‌త్య అని ద్వంద వైఖ‌రి ప్ర‌ద‌ర్శించ‌డం ఆయ‌న‌కే చెల్లింద‌ని కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి త‌ప్పుప‌ట్టారు.

హ‌త్య జ‌రిగిన క్ష‌ణాల్లోపే కేటీఆర్, బీఆర్ఎస్ నాయ‌కులు రంగంలోకి దిగి ప్ర‌భుత్వంపై, వ్య‌క్తిగ‌తంగా త‌న‌పై దుష్ప్ర‌చారం చేయ‌డాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఏం జ‌రిగింది, ఎలా జ‌రిగింద‌ని తెలుసుకోకుండానే కావాల‌నే త‌నపై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు. శ‌వ రాజ‌కీయాలు చేయ‌డం బీఆర్ఎస్ కు కొత్త కాద‌ని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్కడ శవముంటే అక్కడ గ‌ద్ద‌లా వాలి, నేరారోపణలు చేయడం సిగ్గుచేటని ద్వ‌జ‌మెత్తారు.

నేనెంటో ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని, ఇన్నేళ్ల రాజ‌కీయ జీవితంలో ఎలాంటి మ‌చ్చ లేద‌ని, అందుకే కోల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ద‌శాబ్దాలుగా త‌న‌ను ఆద‌రిస్తున్నార‌ని, ఇలా తమ ఎదుగుదలను చూసి ఓర్వ‌లేక పోతున్నార‌ని అన్నారు. గంట్రావ్ పల్లి గ్రామంలో జ‌రిగిన మ‌ల్లేష్ హ‌త్య‌కు కూడా రాజ‌కీయ రంగు పులిమార‌ని, ఇప్పుడు శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య‌ను కూడా రాజ‌కీయం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య‌పై పోలీసులు నిష్పక్ష‌పాతంగా ద‌ర్యాప్తు చేస్తున్నారని, విచార‌ణ‌లో అన్ని విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని, అప్ప‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ నాయ‌కులు వేచి ఉండాల‌ని సూచించారు.బీఆర్ఎస్ నీచ రాజ‌కీయాలు ప‌రాకాష్ట‌కు చేరాయ‌

LEAVE A RESPONSE