Suryaa.co.in

Andhra Pradesh

ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు నాయుడు

కదిరి పట్టణలోని STSN కళాశాల మైదానంలో ముస్లిం సోదరులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…

“రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది…చిత్తశుద్ధితో ముస్లిం సోదరులు దీక్షలు చేస్తారు. ప్రజలు గెలిచి రాష్ట్రం నిలిచేందుకు మీ అందరి సహకారం కోరుతున్నా. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్డీయేలో టీడీపీ, జనసేన చేరాయి. ముస్లింల అభివృద్ధికి కృషి చేసింది…చేసేది టీడీపీయే. 1995-2004 వరకు ముస్లింలకు అనేక పథకాలను ప్రవేశపెట్టాం. హజ్ హౌస్ ల. నిర్మాణం, హజ్ యాత్రకు ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు ఉర్దూను రెండో భాషగా ప్రకటించాం. 2014లో అధికారంలోకి వచ్చాక కడప, విజయవాడలో హజ్ హౌస్ ల నిర్మాణాన్ని చేపట్టాం. 90 శాతం మనం పూర్తి చేస్తే 10 శాతం జగన్ ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసింది. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీని నెలకొల్పాం. మౌజన్, ఇమామ్ లకు గౌరవ వేతన విధానాన్ని తీసుకొచ్చాం. పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించాం. భవిష్యత్తులోనూ ముస్లిం సోదరులకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తాం. రాష్ట్రాన్ని ఐదేళ్లలో జగన్ కోలుకోలేని దెబ్బ తీశారు. రాష్ట్రాన్ని కాపాడేందుకే టీడీపీ, జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. అందరి కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా…ఆశీర్వదించండి.” అని చంద్రబాబు కోరారు.

LEAVE A RESPONSE