Suryaa.co.in

Andhra Pradesh

హైకోర్టులో ఇద్దరు నూతన న్యాయమూర్తులచే ప్రమాణం చేయించిన సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్

అమరావతి,14 మార్చి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులు గా పని చేస్తూ న్యాయమూర్తులుగా నియమింపబడిన జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి,జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టు లోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇరువురు నూతన న్యాయమూర్తులచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఎపి హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు,ఎపి హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి,రిజిష్ట్రార్లు,పబ్లిక్ ప్రాసిక్యూటర్,బార్ అసోసియేషన్ మరియు బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE