Suryaa.co.in

Andhra Pradesh

టీటీడీ ఈఓ ఇంట్లోకి నాగుపాము

– రిటైర్డ్ ఉద్యోగి చేతిపై కాటేసిన సర్పం
– భయాందోళనలో అధికారులు, ఉద్యోగులు

తిరుపతి: టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి ని నాగుపాము కాటు వేసింది. ఈవో శ్యామలరావు బంగ్లాలో రాత్రి భారీ నాగుపాము దూరింది. పామును పట్టుకునేందుకు టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి రవీందర్ నాయుడు బంగ్లాకు వెచ్చారు. చాకచక్యంగా పామును పట్టుకుని గోనె సంచెలో వేస్తుండగా, పాము ఆయన చేతిపై కాటు వేసింది. వెంటనే ఆయనను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు యాంటీ వీనమ్ మందులతో చికిత్స చేశారు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పింది. ప్రస్తుతం రవీందర్ నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. క్వార్టర్స్‌లోకి పాములు రావడంతో అటు ఉద్యోగులు, అధికారులు కూడా భయపడుతున్నారు.

LEAVE A RESPONSE