Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్‌కు అభినందనల వెల్లువ

-విజేతల భజం తట్టిన లోకేష్

అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఘన విజయం సాధించినందుకు ఇద్దరూ పరస్పరం అభినందించుకున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నాయకులు లోకేష్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భారీ మెజారిటీలతో చరిత్ర ను తిరగరాసినందుకు ఎమ్మెల్యేలను, ఎంపిలను, కష్టపడి పార్టీని గెలిపించిన నాయకులను, కార్యకర్తలను లోకేష్ అభినందించారు.లోకేష్‌ను కలసిన వారిలో బుచ్చయ్యచౌదరి, నన్నపనేని రాజకుమారి, అమర్‌నాధ్‌రెడ్డి, బోండా ఉమ, కేశినేని చిన్ని, నెట్టెం రఘరాం, కోటంరెడ్డి తదితరులున్నారు.

LEAVE A RESPONSE