– పార్టీలో ఉంటూ ప్రభుత్వంపై ఎలా విమర్శిస్తారు?
– గెలుపోటములు ప్రజాధీనం
-మేం మల్లన్న కోసం పనిచేయలేదా?
– మా పార్టీ అభ్యర్ధిని మేమెలా ఓడిపోవాలని కోరుకుంటాం?
– తీన్మార్ మల్లన్నపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిఫైర్
హైదరాబాద్: కాంగ్రెస్ బీ ఫారంపై పోటీ చేసి గెలిచిన తీన్మార్ మల్లన్న.. ఇప్పుడు అదే ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదు. వ్యక్తిగతంగా తనను విమర్శిస్తే పట్టించుకోను. కానీ ఒక కులాన్ని దూషిస్తే ఏమాత్రం సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ బీసీ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ సభను ఏర్పాటు చేసి ఇతర కులాలను దూషించడం సరికాదని మంత్రి అన్నారు. గెలుపోటములను నిర్ణయించేది వ్యక్తులు కాదని, ప్రజ లు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తీన్మార్ మల్లన్న గెలుపు కోసం పని చేశామ ని భారీ ర్యాలీ నిర్వహించి, అన్ని వర్గాలను మెప్పించి గెలిపించుకున్నామని మంత్రి తెలిపారు. తాను జిల్లాకు మంత్రిగా ఉండి పార్టీ నుండి పోటీకి దింపి, అతను ఓడిపోవాలని కోరుకుంటానా? బీసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ మంచి నిర్ణయం తీసుకుందన్నారు. ఎస్సీ వర్గీకరణ, కుల గణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. కేంద్రం అంగీకరిస్తే ఫర్వాలేదని, లేకుంటే తమ పార్టీ మాత్రం రిజర్వేషన్లను అమలు చేస్తుందని తెలిపారు . కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు ఉన్న ఆస్తులు ఎన్నో చెప్పాలంటే, ఓ పుస్తకమే రాయాలని ఎద్దేవా చేశారు. కుల గణన సర్వేలో కవిత మినహా కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదన్నారు.