Suryaa.co.in

Telangana

ధరణిని పూర్తిగా మారుస్తాం

– అసైన్డ్ భూములు తిరిగి పేదలకు అప్పగిస్తాం
-తెల్లాపూర్ లో గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన భట్టి విక్రమార్క
– హాజరైన సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కంచె ఐలయ్య

ధరణి ని పూర్తిగా మారుస్తాం. అసైన్డ్ భూములు తిరిగి పేదలకు అప్పగిస్తాం. గద్దర్ భావజాలం చేయడానికి అధికారికంగా జయంతి కార్యక్రమాలు. పాత రెవెన్యూ రికార్డుల్లో ఉన్న కాలం అన్నిటిని తొలగించిన ధరణి పూర్తిగా మారుస్తాం భూములు కోల్పోయిన పేద రైతులకు అసైన్డ్ భూములు తిరిగి అప్పగిస్తాం. వెట్టి చాకిరీ కింద ఇచ్చిన భూములను సైతం బి.ఆర్.ఎస్ ప్రభుత్వ పెద్దలు గుంజుకున్నరు.

గద్దర్ భావజాలాన్ని ఈ ప్రభుత్వం సమర్థిస్తుంది అందుకే ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నాం రాష్ట్రంలో ప్రముఖ స్థానాల్లో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తెళ్ళపూర్ లో ఏర్పాటు అయ్యింది మొదటి విగ్రహం మాత్రమే.. గద్దర్ తో చాలా రోజులు గడిచాను ఆయన ప్రతి సమస్యకు స్పందిస్తారు భాష రాణి వారికి భాష నేర్పిస్తారు. రాణి భాషను నేర్చుకుంటారు.

LEAVE A RESPONSE