Suryaa.co.in

Telangana

ఏఐను వాడలేదు

20 వేలు ఇస్తు రీల్స్ చేయిస్తున్నారు
– మన్నే క్రిశాంక్ బీఆర్ఎస్ నేత
– బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్ కు గచ్చిబౌలి పోలీసుల నోటీసులు
– హెచ్‌సియు అంశంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేశారని నోటీసులు

హైదరాబాద్: కాంగ్రెస్ డ్యామేజ్ కంట్రోల్ చేయడం ప్రారంభించింది. ఏఐ ను ఎక్కడ వాడలేదు. ఇటీవల హెచ్‌సియు లొ విడుదల చేసిన ఫోటోలు విడియోలు అన్ని వాస్తవమే. మేము లీగల్ గా ఎదుర్కొంటాం. జింకలు ఎందుకు రోడ్డు మీదకు వచ్చాయి. ఇళ్లలోకి కూడా వెళ్ళాయి అవన్నీ వీడియోలు ఉన్నాయి. అక్కడ జింకలు లేవు. అక్కడ నక్కలు ఉన్నాయని అన్నారు. ఆంక్షలు పెట్టారు,ఇక్కడ ఎవరు రావొద్దు అని ప్రకటన చేశారు.

ఏఐతో వీడియో లు సృష్టించారు అని అబద్ధాలు చెప్తుంది. ఏఐ గురించి మాట్లాడే అర్హత ఉందా కాంగ్రెస్ కు? జాతీయ స్థాయిలో ఆ వీడియో లు జింకలు, నెమళ్లున్నాయని తేలింది. 4 కేసులు నాపై పెట్టింది ప్రభుత్వం. జింకలు చనిపోవడానికి కారణం ఎవరు, ఆ చెట్లను నరకడానికి కారణం ఎవరు? వీటికి కారణం అయిన ఎవరిపైనా కేసులు పెట్టాలి. అందరూ వీడియోలు పెడుతున్నారు. 20 వేలు ఇస్తు రీల్స్ చేయిస్తున్నారు.

LEAVE A RESPONSE