-ఆంధ్రా కాంట్రాక్టర్లే దొరికారా?
– అమరవీరుల స్తూపం కాంట్రాక్టులో కేసీఆర్ కుమ్మక్కు
– టీపీసీసీ చీఫ్ రేవంత్
ఉద్యమ సమయంలో పిడికెడుమంది ఆంధ్రా కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించిన కేసీఆర్ అదే ఆంధ్రా కాంట్రాక్టర్లకే టెండర్లు కట్టబెడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు. అందువల్ల కేటీఆర్కు డీఎన్ఏ టెస్టు నిర్వహించి, ఆయన తెలంగాణ వాడా కాదా అని తేల్చాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం నిర్మాణంలో కోట్ల రూపాయల గోల్మాల్ జరుగుతోందని, నిర్మాణ వ్యయాన్ని విపరీతంగా పెంచారని ఆరోపించారు.అమరవీరుల స్తూప నిర్మాణ ప్రాంతాన్ని ఆయన ీఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ నేత డాక్టర్ రోహిన్రెడ్డి తదితర నేతలతో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే.. అమరవీరులకు గుర్తింపు ఉంటుందని అనుకున్నాం. అమరులకు గుర్తింపు ఉంటుందని సీఎం ప్రజలను.. ఎమ్మెల్యే లను నమ్మించాడు. అమరులకు ఉద్యోగం..ఆర్ధిక సాయం, భూమి ఇస్తా అన్నారు.అమరవీరుల స్థూపం ప్రపంచం అచ్చర్యపోయెల నిర్మిస్తాం అన్నారు. ఏడు
ఏండ్లు అయ్యింది.. మూడేళ్లు అసలు పట్టించుకోలేదు. 2017 లో అమర వీరుల స్తూపం నిర్మాణంకి 80 కోట్లు కేటాయించింది. ఏడాది వరకు అసలు స్థూపం గురించి పట్టించుకోలేదు. 2018 లో టెండర్ పిలిచారు. డిజైన్ అయ్యాక 63 కోట్ల 75 లక్షల తో టెండర్ పిలిచారు. ఏడాదిలో పూర్తి చేస్తాం అని కెసిఆర్ చెప్పారు.టెండర్ రెండు సార్లు వాయిదా వేసింది సర్కార్. ఈ టెండర్ కెపిసి ప్రాజెక్ట్ లిమిటెడ్ కి ఇచ్చింది.
కామిశెట్టి పుల్లయ్య కంపెనీ పొద్దుటూర్ శెట్టి గారిది కంపెనీ.కంపెనీకి ఎలాంటి అనుభవం లేకున్నా… తప్పుడు సర్టిఫికెట్ తో పనులు అప్పగించారు.6 శాతం కన్సల్టెంట్ ఫీజు ఇస్తుంది.రేకులు.. ఇనుముతో కట్టిన నిర్మాణం కి 177 కోట్ల కు వ్యయం పెంచారు.127 కోట్ల మేర అంచనా పెంచారు. కేటీఆర్ నీ మెప్పించి వ్యయం పెంచుకున్నాడు.177 కోట్లకు వ్యయం పెంచినా.. పనులు పూర్తి కాలేదు. 12 నెలల్లో పూర్తి చేయాల్సిన పని నాలుగున్నర నెలలు అయ్యింది.
అమర వీరుల స్తూపం మొండి గోడలు నిలబడింది. 60 కోట్లతో మొదలైన స్థూపం.. 180 కోట్లకు పెంచారు. సీఎం పక్కనే ఉన్న సచివాలయం సందర్శన చేసి, దసరా లోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సచివాలయం కట్టుకుంటావా… సమాధి కట్టుకుంతవా నీ ఇష్టం. కానీ అమర వీరుల స్తూపం సంగతి ఎంటి,
అమరవీరుల స్థూపం నిర్మాణం పొద్దు టురు వారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. తెలంగాణలో ఎవరు అర్హులు లేరా? పిడికెడు ఆంధ్ర కాంట్రాక్టర్ లు తెలంగాణ నీ దోచుకుంటున్నారు అని చెప్పింది నువ్వే. కెసిఆర్ కో డిఎన్ఎ టెస్ట్ చేయాలి. అసలు తెలంగాణ వాడే నా అని తేలాలి. టీ హబ్ నిర్మాణం లో కోట్ల రూపాయలు కొల్లగొట్టింది అని కాగ్ చెప్పిన సంస్థ నే అమర వీరుల స్తూపం నిర్మాణం పనులు ఇచ్చింది. 300 శాతం బడ్జెట్ పెంచారు.
ఈ అవినీతికి కేటీఆర్, అతని ఫ్రెండ్ తెలుకుంట శ్రీధర్ రే కారణం. ఈ కుంభకోణం బయట పడాలంటే.. విచారణ కమిటీ వేయాలి. ఆలస్యానికి కారణం ఏంటో బయట పడాలి. ఆంధ్ర కాంట్రాక్టర్ కు ఇవ్వడనికి కారణం ఏంటీ. కెసిఆర్ కుటుంబాన్ని వెలివేయలి. సాంఘీక బహిష్కరణ చేయాలి. ఎవరి శుభకార్యాలకు పిలువొద్దు, వాళ్ళ పిల్లలకు పిల్లను ఎవరు ఎవ్వొద్దు. కెసిఆర్ ముక్కు నేలకు రాయాలి. .
జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్
ఫామ్ హౌజ్ లు, భవనాలు కట్టుకోడానికి డబ్బులున్నాయి. కానీ అమరవీరుల స్తూపానికి డబ్బులు లేవా? అసలు చనిపోయిన వాళ్లు ఎంత మంది? 1200 మంది చనిపోయారు అన్నారు.. కానీ సర్కార్.. 500 మందే అని అంటోంది. అమర కుటుంబాలకు… ఉద్యోగాలు లేవు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేవు, ఆర్ధిక సాయం లేదు. అమర కుటుంబాలు భిక్షగాల్లుగా మార్చేసింది సర్కార్. ఈ అమరవీరుల స్తూపం.. 1200 మందిదా.. లేక కెసిఆర్ గుర్తించిన 500 మందిదా? గుర్తించడంలో కూడా కెసిఆర్ వివక్ష. అభివృద్ధిని, నిరుద్యోగాన్ని కాదు.. చనిపోయిన వారిని గుర్తించరా.. కెసిఆర్ క్షుద్ర రాజకీయంలో.. ఉద్యమకారులు బలి పశువులయ్యారు.