Suryaa.co.in

Andhra Pradesh

బాంబులకే భయపడం…బుల్లెట్లకు భయపడతామా?

జగన్ ఇసుకను పందికొక్కులా తింటున్నాడు

– ఇసుక దోపిడీలో రోజుకి జగన్ ఆదాయం రూ.3 కోట్లు
– నెలకి రూ.90 కోట్లు, ఏడాదికి రూ.1080 కోట్లు, ఐదేళ్లకు రూ.5400 కోట్లు
– ఇంటి పేరు బొల్లా…చెప్పే మాట‌లన్నీ డొల్ల‌
– ఎమ్మెల్యే పేరు బ్ర‌హ్మ‌నాయుడు కాదు..క‌బ్జాలరాయుడు
– ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ బహిరంగ సభలో నారా లోకేష్

పౌరుషాల గడ్డ పల్నాడు. శ్రీరాముడు అడుగుపెట్టిన పుణ్యభూమి వినుకొండ. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, జామియా మస్జీద్ ఉన్న నేల వినుకొండ.గొప్ప కవి. గుర్రం జాషువా జన్మించిన గడ్డ వినుకొండ. ఎంతో ఘన చరిత్ర ఉన్న వినుకొండ నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం,మనగళం,ప్రజాబలం.

చిత్తూరు జనసంద్రంగా మారింది, అనంతపురం అదిరిపోయింది, కర్నూలు కదం తొక్కింది, కడప కసి పెంచింది,నెల్లూరు నాటు దెబ్బకి జగన్ దిమ్మతిరిగింది, ప్రకాశంలో జనసునామి, ఇప్పుడు గుంటూరు గర్జించింది.

జగన్ ని చూస్తే నాకు జాలేస్తుంది.యువగళాన్ని ఆపడానికి సైకో జగన్ ఎన్నో ప్రయత్నాలు చేసాడు.పోలీసుల్ని పంపాడు మనం తగ్గేదేలేదు అన్నాం. మైక్ వెహికల్ లాక్కున్నాడు. ఇది స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి గొంతు. ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు.మధ్యలో ఫ్లెక్సీలు పెట్టాడు మన వాళ్లు చించేసారు.వాళ్లు గుడ్లు వేసారు మన వాళ్లు ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.

వినుకొండలో ఫైరింగ్ వరకూ వచ్చింది. బాంబులకే భయపడం…బుల్లెట్లకు భయపడతామా?
భయం మా బ్లడ్ లో లేదు సైకో జగన్.వైసీపీ సిల్లీ ఫెల్లోస్ కి మరో సారి చెబుతున్నా. చిల్లర వేషాలు వద్దు.సాగనిస్తే పాదయాత్ర…అడ్డుకుంటే వైసిపి కి అంతిమయాత్ర. జగన్ ఇసుకాసురుడుగా మారాడు. జగన్ ఇసుకను పందికొక్కులా తింటున్నాడు.

టిడిపి హయాంలో రూ.1500 ఉన్న ట్రాక్టర్ ఇసుక జగన్ పాలనలో రూ.5వేలు. ఇసుక దోపిడీలో రోజుకి జగన్ ఆదాయం ఎంతో తెలుసా? రూ.3 కోట్లు.నెలకి రూ.90 కోట్లు, ఏడాదికి రూ.1080 కోట్లు, ఐదేళ్లకు రూ.5400 కోట్లు. ఇసుక కోసం ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు జగన్.

స్వ‌ర్ణ‌ముఖిన‌దిలో 10 అడుగులు త‌వ్వాల్సిన చోట 30 అడుగుల లోతు తవ్వేసారు. చంద్ర‌గిరి మండ‌లం రెడ్డివారిప‌ల్లె స్వ‌ర్ణ‌ముఖి న‌ది ఇసుక గుంతలో పడి యువకుడు కార్తీక్ చనిపోయాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న కార్తీక్ ని సైకో జగన్ చంపేసాడు. జ‌గ‌న్ ఇసుక మాఫియా త‌వ్విన గుంతల్లో ప‌డి వంద‌ల మంది ప్రాణాలు పోయాయి.

ఇవ్వ‌న్నీ సైకో జ‌గ‌న్ శాండ్ మాఫియా చేసిన హ‌త్య‌లే. దీనికి కారణం అయిన వారిపై టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం.జగన్ కి పేదలంటే కోపం. నేను ముందే చెప్పా జరగబోయేది పేదలకు, దోపిడీదార్లకు మధ్య యుద్ధం అని.ఇప్పుడు అదే నిజం అయ్యింది. గోదావరి వరదలు వచ్చి పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే జగన్ ప్యాలస్ లో పడుకున్నాడు. వరదల్లో చిక్కుకున్న వారిని కనీసం పరామర్శించడానికి ఆయనకి మనస్సు రాలేదు.

వేరే పనులకు ఆయనకు టైం ఉంది. కానీ వరద మీద సమీక్ష చెయ్యడానికి టైం లేదు. బాధితుల్ని పరామర్శించడానికి టైం లేదు.వరద తగ్గాక నిత్యావసర సరుకులు ఇస్తాం అంటుంది ఈ సైకో ప్రభుత్వం.అప్పటి వరకూ పేద ప్రజలు ఎం తినాలి? నీట్లో చావాల్సిందేనా?ఇళ్ళన్నీ నీట్లో మునిగిపోయాయి. పునరావాస కేంద్రాల్లో పాచిపోయిన అన్నం పెడుతున్నాడు ఈ సైకో జగన్.

కుళ్లిపోయిన కూరగాయలు, రెండు ఇళ్లకు ఒక క్యాబేజ్ ఇచ్చాడంట ఈ సైకో. ప్రజలు నీట్లో ఉంటే చూసి నవ్వుకునే సైకో మనస్తత్వం జగన్ ది. అదే చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు వరద వస్తే అధికారుల కంటే ముందు ఆయనే అక్కడ ఉండేవారు. వారిని ఆదుకునే వారు. పేదల పై ప్రేమ అంటే అది.

జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా.జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్.బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు.

పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ పై కూడా బాదుడే బాదుడు.
జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను.అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్.

జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేశాడు.సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు.

2,200 కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.

జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు.

యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు.జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2.

రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. ఇన్పుట్ సబ్సిడీ, డ్రిప్, రైతు రథాలు అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.

జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు.
పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.

ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్ కూడా కట్ చేసాడు జగన్. 15 శాతం అలవెన్స్ కట్ చేసాడు. ఎస్ఐ కి 10 వేలు, హెడ్ కానిస్టేబుల్ కి 8 వేలు, కానిస్టేబుల్ కి 6 వేలు కట్ చేసాడు. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది.

బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.

డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు.దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు.

మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు.2014 లో బిజేపి తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాం. అయినా ఏనాడూ మైనార్టీ ల పై ఒక్క దాడి జరగలేదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. 2024 లో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం
వినుకొండ ని అభివృద్ధి చేసింది టిడిపి.రూ. 2,400 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. పల్నాడు ముద్దు బిడ్డ జీవి. ఆంజనేయులు నేను మంత్రిగా ఉన్నప్పుడు నాతో పోరాడేవారు. మాది వెనుకబడిన ప్రాంతం మాకు ఎక్కువ నిధులు ఇవ్వాలి అని వెంటపడేవారు.తాగు, సాగు నీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, గ్రామాల్లో సిసి రోడ్లు, బ్రిడ్జిలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం.కానీ మీరు ఏమి చేసారు పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు.

వినుకొండని అభివృద్ధి చేస్తారని మీరు భారీ మెజారిటీతో బొల్లా బ్రహ్మనాయుడుని గెలిపించారు.కానీ ఆయన వినుకొండ కి పీకింది ఎంటి? పొడిచింది ఎంటి?
ఎమ్మెల్యే ఇంటి పేరు బొల్లా…చెప్పే మాట‌లన్నీ డొల్ల‌.ఎమ్మెల్యే పేరు బ్ర‌హ్మ‌నాయుడు కాదు..క‌బ్జాలరాయుడు. వినుకొండలో మైనార్టీ సోదరుడు ఫరీద్ కుటుంబానికి చెందిన సర్వే నంబర్ 214 లో మూడు ఎకరాల భూమిని కబ్జా చేసాడు. ప్రశ్నించినందుకు ఫరీద్ మనవడు నాగూర్ వలీని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి చితకబాదారుతెల్లపాడులో వైశ్య సామాజికవర్గానికి చెందిన శ్రీనుకి చెందిన ఎనిమిది ఎకరాల భూమిని కబ్జా చేసాడు.వెంకుపాలెం వద్ద డైరీకి రోడ్డు వేసుకోవడానికి దళిత మహిళల కి చెందిన 1.50 ఎకరాల భూమిని కబ్జాచేసాడు.

ప్రభుత్వ భూమిని ఆక్ర‌మించి సెంటు స్థలాల పేరుతో మ‌ళ్లీ ప్రభుత్వానికే 20 కోట్ల‌కి అమ్మేసాడు క‌బ్జాలరాయుడు.కబ్జాలరాయుడు బ్రాహ్మణపల్లి రెవెన్యూ ప‌రిధిలో 170 ఎకరాల ప్రభుత్వ భూములను కాజేశాడు.పసుపులేరు బ్రిడ్జి వద్ద 62 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించాడు.

గుండ్లకమ్మ నది, వాగుల నుండి ఇసుక దోపిడి చేస్తున్నాడు. ప్రభుత్వ భూములు, చెరువుల్లో మ‌ట్టినీ దోచేస్తున్నాడు. క‌బ్జాల రాయుడు క‌నుస‌న్న‌ల్లోనే బియ్యం, మద్యం, గుట్కా మాఫియాలు న‌డుస్తున్నాయి.నియోజకవర్గంలో ఏ పని జరగాలన్న ఎమ్మెల్యేకి “బీ “టాక్స్ చెల్లించాల్సిందే.
వినుకొండలో అపార్ట్మెంట్ నిర్మించాలంటే “బీ”టాక్స్ క‌ట్టాల్సిందే.కబ్జాల రాయుడు చేతగాని వాడు. 4 ఏళ్లలో పీకింది ఏమి లేదు. 4 ఏళ్ల క్రితం ఎక్కడ వినుకొండ ఎక్కడ ఉందో ఇప్పుడూ అక్కడే ఉంది.

టిడిపి హయాంలో ప్రారంభించిన పనులకు రిబ్బన్ కట్టింగ్ చేస్తున్నాడు. పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములని అక్రమ రిజిస్ట్రేషన్ల‌తో కొట్టేసి, వాటిపై వందల కోట్లు బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకుంటున్నాడు. వినుకొండ మున్సిపాలిటీని ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలు ,దౌర్జన్యాలు, దోపిడీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసాడు.

బొల్లాపల్లి మండలంలో రెవెన్యూ రికార్డులు తారుమారు చేయించి 13 వేల ఎకరాలకు 8 వేల పాస్ బుక్‌లు ఇప్పించి 100 కోట్లు దోచేసాడు ఎమ్మెల్యే . ఈ క‌బ్జారాయుడుని ఓడించ‌క‌పోతే…వినుకొండ‌లో ఎవరి భూమీ మిగ‌ల‌దు. కొండ‌లు మింగేస్తాడు.. మ‌ట్టి, ఇసుక క‌నిపించ‌దు.

జగన్ వినుకొండకి అనేక హామీలు ఇచ్చాడు.వరకపూడిసెల ప్రాజెక్టు నిర్మిస్తాం అన్నాడు.తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా అన్నాడు. వినుకొండ లో మైనార్టీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తానని అన్నాడు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తా అన్నాడు.ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. వినుకొండ సమస్యల గురించి అడిగే దమ్ము కబ్జాల రాయుడు కి లేదు.

2024 లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయం. వినుకొండలో భారీ మెజారిటీ తో టిడిపిని గెలిపించండి.ఫ్లోరైడ్ సమస్య గురించి నేను తెలుసుకున్నాను. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. బొల్లాపల్లి మండల తాగు, సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే వరికపూడిసెల ప్రాజెక్టు నిర్మిస్తాం. టిడిపి గెలిచిన మూడేళ్ల లోనే ప్రాజెక్టు పూర్తి చేస్తాం.

పరిశ్రమలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పూర్తిగా దెబ్బతిన్న రహదారుల స్థానంలో కొత్త‌వి నిర్మిస్తాం.గుండ్లకమ్మ నదిపై చెక్ డ్యాములు నిర్మించి సాగు నీటి వ‌స‌తి క‌ల్పిస్తాం.వినుకొండలో ముస్లిం మైనారిటీలకు షాదీ ఖానా నిర్మిస్తాం. 90 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లు పూర్తిచేసి ల‌బ్ధిదారుల‌కి అంద‌జేస్తాం.

వినుకొండ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ భూముల్లో రైతుల‌కి ఎన్టీఆర్ జలసిరి బోర్లు, సోలార్ అనుసంధాన మోటార్లు వేయిస్తాం.వరి,మిర్చి,పత్తి,పొగాకు రైతుల కష్టాలు నేను చూసాను. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం.

కబ్జాల రాయుడు భూకబ్జాలపై ప్రత్యేక సిట్ వేస్తాం. భూములు అన్ని వెనక్కి తీసుకోని పేదలకు పంచేస్తాం.9 నెలలు ఓపిక పట్టండి కబ్జాల రాయుడు కి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత నాది. టిడిపి కార్యకర్తల జోలికి రావాలి అంటే భయపడే విధంగా చేస్తాను. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన అధికారుల పై చర్యలు తీసుకుంటాం. అందరి పేర్లు ఎర్ర పుస్తకం లో రాసుకుంటున్నా.పోరాడిన ప్రతి కార్యకర్తని ఆదుకుంటాం. కేసులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ఎక్కువ కేసులు ఉన్న వారికి పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తాం. ప్రస్తుతానికి జేసీ దివాకర్ రెడ్డి గారి పై 74 కేసులు ఉన్నాయి. అయినా ఆయన తగ్గడం లేదు. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లు వినుకొండ లో ఉన్నా విదేశాలకు పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా.

 

LEAVE A RESPONSE