Suryaa.co.in

Telangana

అభయహస్తం రైతుల పాలిట భస్మాసుర హస్తం

-ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా సాయం అందించాలని తెలియదా?
-బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ : కాంగ్రెస్ అభయహస్తం రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి…. రైతుల విషయంలో రాష్ట్ర సర్కారు తీరుపై మండిపడ్డారు.

రైతు బిడ్డను అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి కి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా సాయం అందించాలని తెలియదా… లేకుంటే కుంటి సాకులతో దాటవేసే ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు.

ఎండాకాలం పంట సాగుకు ఇవ్వలేదు, ఇప్పుడు వానాకాలం పంట సాగుకు కూడా సాయం ఇవ్వకపోతే రైతులు సాగు ముందుకు ఎలా సాగుతుందని అడిగారు. ఇప్పటికే వానాకాలం పంటల సాగు మొదలయి నెల అవుతోందని పెట్టుబడి కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు, ఈ నెలాఖరులోగా ఎలాంటి కండిషన్స్, కట్ ఆఫ్స్ పెట్టకుండా రైతులందరికీ సాయం అందించాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE