Suryaa.co.in

Andhra Pradesh

సుజనా తనయుడు కార్తీక్ కు స్థానికుల మొర

-తాగునీటి సమస్యను పరిష్కరించాలి
-అన్ని సమస్యలకూ మా తండ్రి గెలుపుతోనే పరిష్కారం: కార్తీక్
-ఫ్రైజరు పేటలో తండ్రి కోసం తనయుడు కార్తీక్ ప్రచారం

ఓవైపు తండ్రి, మరోవైపు తనయుడు, ఇంకోవైపు సోదరి… విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా కుటుంబం సుడిగాలి ప్రచారం చేస్తోంది. మంగళవారం సుజనా తనయుడు కార్తీక్ 49వ డివిజన్ లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను కార్తీక్ కు మొరపెట్టుకున్నారు.

ఫ్రైజరు పేట, వందనం వారి వీధి చర్చి వీధి, జేమ్స్ వీధి, పెద్దురాజు వీధి, ట్యాంక్ రోడ్డు,పరిసర ప్రాంతాలలో కార్తీక్ ప్రచారం చేశారు. ఫ్రైజ ర్డ్ పేట, కొండ ప్రాంతాల్లో తాగు నీటి సమస్య అధికంగా ఉందని అక్కడి ప్రజలు కార్తీక్ కు చెప్పుకున్నారు. తన తండ్రిని గెలిపిస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తారని, బీజేపీని గెలిపించండి అంటూ ప్రజలను కార్తీక్ కోరారు. ప్రచారంలో కార్తీక్ వెంట 49వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బడుగు వెంకన్న, కార్యదర్శి లంకా శ్రీను, నాయకులు కత్తి డేవిడ్, సరిపల్లి అశోక్, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE