Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డికి అంతిమ తీర్పు

– ఐదేళ్లుగా ప్రజల హక్కులను హరించారు
– ఈ ఎన్నిక జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు
-జగన్ రెడ్డి తమ అంతేవాసులను పెట్టుకుని రాష్ట్ర ఖజానాను దోచుకున్నారు

-అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు
-ప్రజా ఉద్యమంలో ఎన్డీయే కూటమి గెలవబోతుంది
– మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఏపీలో అరాచక, ఆటవిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లాది ప్రజలు తరలివచ్చి తమ తీర్పును వెలువరించారు. 5 ఏళ్లు భరించి, ఓపిక నశించిన, ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మార్గం అని భావించిన ప్రజలు ఉదయం 5 నుండి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడి ఓట్లు వేయడం వెనుక ప్రజలు కోరుకుంటున్న మార్పు స్పష్టమవుతుంది.

5ఏళ్లలో ప్రతి రంగాన్ని కూల్చారు, ప్రతి వర్గాన్ని అధోగతిపాలు చేశారు, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా చేశారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు అంతం లేకుండా పోయింది. పోలీసు రాజ్యం నడిపారు, నియంతృత్వపోకడతో ప్రభుత్వాన్ని నడిపారు, ప్రజల హక్కులను హరించారు, ప్రజా ఉద్యమాలను అణిచివేశారు, ఉద్యోగులు, దళితవర్గాలు, బలహీన వర్గాలను అణగదొక్కారు. వైసీపీ సామ్రాజ్యంలో ఇష్టారీతిన చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నియంత పోకడ పోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు అన్ని ప్రాంతాల నుండి ఒక ఉద్యమంలా పోరుబాట పట్టినట్లు ఓటు బాట పట్టారు.

ఈ ఉద్యమంలో ఎన్డీయే కూటమి గెలవబోతుంది..ఈ ఎన్నిక జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులా ముందుకు సాగింది. దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా పోరాట పంథాలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యాయపరమైన హక్కులను వైసీపీ హరించింది. న్యాయ వ్యవస్థ, రాజ్యాంగంపై నమ్మకం లేకుండా చేశారు. రాష్ట్రాన్ని వైసీపీ జాగీరులా మార్చారు.. తమ అంతేవాసులను పెట్టుకుని రాష్ట్ర ఖజానాను దోచుకున్నారు.

ఎక్సైజ్, మైనింగ్ డిపార్ట్మెంట్లలో రికార్డులను నేడు మాయం చేయడం, మార్చడం వంటి చర్యలకు వైసీపీ పాల్పడుతోంది. తాము చేసిన మోసాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రం కొంతమంది జాగీరులా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు నిన్న జరిగిన పోలింగ్ విధానం తెలియజేసింది. జగన్మోహన్ రెడ్డికి అంతిమ తీర్పును ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును 80శాతం పైబడి వినియోగించుకోవడం శుభపరిణామం.

జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కోలుకోలేని చావు దెబ్బ తగలబోతుంది. హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం, దాన్ని సమర్థించడం, గోబెల్స్ ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని తిట్టించడం చేసే జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికలు శాపంగా మారబోతున్నాయి. 2019లో 151సీట్లు ప్రజలు ఇస్తే ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల రాష్ట్రం నాశనమైంది. రూ.13లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారు.

రాష్ట్ర ప్రజల నెత్తిన తలసరి రూ.10లక్షల అప్పు మోపారు. జగన్మోహన్ రెడ్డి రంగులు, పేర్ల పిచ్చి వల్ల ప్రభుత్వ పథకాలను అడ్డు పెట్టుకుని పిల్లలు అడుకునే ఆట వస్తువులపై, పిల్లలు వేసుకునే లంగోటాలపై, కోడిగుడ్లపై కూడా బొమ్మలు వేసుకునే దరిద్రపు ఆలోచన ఏ ముఖ్యమంత్రికీ రాకూడదని మేం కోరుకుంటున్నాం. అనేక చోట్ల వైసీపీ రాక్షస క్రీడకు పాల్పడింది..పల్నాడు, రాయలసీమ వాళ్ల జాగీరులా భావించి హింసకు పాల్పడ్డారు. ఈవీఎంలు ఎత్తుకుపోయేందుకు ప్రయత్నించారు.

కొంత మంది అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ విధమైన ఘటనలు జరిగాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..అందుకే ఈ స్థాయిలో పోలింగ్ జరిగింది. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి విజయం తధ్యం. చంద్రబాబు నిర్విరామ కృషికి ఈ విజయం నిదర్శనంగా నిలవబోతుంది. అగ్నికి, వాయువు తోడైనట్లు పవన్ కళ్యాణ్ సహకారం మరువలేనిది. వీళ్ల కలయికతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మోడీ ఏపీకి సహకరిస్తారనే ఉద్దేశంతో పోలింగ్ ఈ స్థాయిలో జరిగింది. ప్రజాస్వామ్య మనుగడకు ఈ ఎన్నికలు కొలమానంగా నిలవబోతున్నాయి.

ఏపీ భవిష్యత్తు, తెలుగుజాతి ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ఇచ్చిన ఈ మ్యాండెట్ చిరకాలం గుర్తుండబోతుంది..విజయం తధ్యం. వైసీపీ సీనియర్ నాయకులకు డిపాజిట్లు గల్లంతై, అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి రాబోతుంది. ఎవరైతే బూతు పంచాంగం చెప్పారో, అరాచకానికి పాల్పడ్డారో, దమనకాండకు దోహదపడ్డారో వారంతా చిత్తుచిత్తుగా ఓడి ఇంటికి వెళ్లబోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేందుకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇతర దేశాలు, రాష్ట్రాలు, జిల్లాల నుండి తరలి వచ్చారు.

ఎన్నో కష్టాలు ఎదురైనా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. రానున్న ఎన్నికల ఫలితాల సమయంలోనూ అధికారులు భారీ బందోబస్తు పెట్టి సహకరించాలని కోరుతున్నాను. అధికారులు ప్రజల హక్కులను హరించకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. ఎవరికీ వత్తాసు పలకకుండా పారదర్శకంగా వ్యవహరించాలి. ప్రజా తిరుగుబాటు వైసీపీకి గుణపాఠం కాబోతుంది…ఎన్డీయే కూటమి విజయం సాధించబోతుంది. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందబోతుంది.

LEAVE A RESPONSE