Suryaa.co.in

Andhra Pradesh

పులివర్తి నానిపై వైసీపీ మూకలు చేసిన దాడిని ఖండిస్తున్నాం

-శాంతిభద్రతలకు విఘాతం కల్గించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిలను వెంటనే అరెస్ట్ చేయాలి
– తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

నిన్న పోలింగ్ బూత్‌ల వద్ద జనసునామీని చూసిన జగన్ రెడ్డి ప్రజావ్యతిరేకతను సహించలేకపోతున్నారు. తమ హింసా సంస్కృతి అస్త్రాన్ని ప్రయోగించారు. ఓడిపోతున్నామన్న భయంతోనే వీధి కుక్కల స్వైర విహారం వలె, వైసీపీ మూకలు బయటి వచ్చి దాడులు చేస్తున్నారు. చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్ధి పులివర్తి నానిపై వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. చంద్రగిరిలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలి. శాంతిభద్రతలకు విఘాంతం కలిగించడం, తెదేపా అభ్యర్ధి పులివర్తి నానిపై హత్యాయత్నం చేసినందుకు గాను హత్యాయత్నం కేసు, పబ్లిక్ సర్వెంట్ (గన్‌మ్యాన్) తన విధులను నిర్వర్తించకుండా నిరోధించినందుకు గాను భారత ఆయుధ చట్టం, ఆర్‌పి చట్టం కింద కేసు నమోదు చేయాలని తిరుపతి ఎస్పీ కి SMS ద్వారా కోరాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మోహిత్ రెడ్డిలను తక్షణమే అరెస్ట్ చేసి శాంతిభద్రతలను కాపాడాలని కోరడం జరిగింది.

LEAVE A RESPONSE