– తులం బంగారం, పింఛన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డిని ఎక్కడ కట్టివేయాలి?
– రేవంత్ రెడ్డి పాలనపై చర్చకు సిద్ధం
– ప్రజలను రేవంత్ రెడ్డి భయపెడుతున్నారా?
– సంక్షేమ పధకాలు ఆగితే పోరాటం ఎట్లా చేయాలో మాకు తెలుసు
– ఎన్టీఆర్ కు మాగంటి గోపీనాథ్ వీరాభిమాని
– ఎన్టీఆర్ తో కలిసి మాగంటి గోపీనాథ్ తిరిగారు. కమ్మ వర్గం ఓట్ల కోసం ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడారు
– ప్రభుత్వాన్ని సర్కస్ కంపెనీలా నడిపిస్తున్నారు
– రేవంత్ రెడ్డి అలవాట్లు అందరికీ ఉండవు
– కాశీబుగ్గ తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు సంతాపం
– సీఎం రేవంత్పై విరుచుకుపడిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: రేవంత్ రెడ్డి భాష ఇప్పటికైనా మార్చుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్ కు సిద్దం కావాలి. 23 నెలల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఎక్కడ తిరిగారో చెప్పాలి. బిఆర్ఎస్ హయాంలో 44 వేల కోట్లు హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టాము. కాంగ్రెస్ కేవలం 4,600 కోట్లు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టింది.
హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇళ్ళు అయినా కట్టారా? కేటిఆర్ హైదరాబాద్ తిరగలేదని రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారా? లేక వేరే దేశంలో ఉన్నారా? తులం బంగారం,పింఛన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డిని ఎక్కడ కట్టివేయాలి?
కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత, 4 వేల కోట్ల అభివృద్ధి జరిగింది అని నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధంగా ఉన్నా. బిఆర్ఎస్ డిమాండ్ తోనే అజహరుద్దీన్ మంత్రి పదవి వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే అజహారుద్దిన్ కు మంత్రి పదవి ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు?
23 నెలల్లో రేవంత్ రెడ్డి పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నాము. అమీర్ పేట్ కు రేవంత్ రెడ్డి వచ్చి 4 నెలలు అయింది ఏం చేశారో చెప్పండి. ఎన్టీఆర్ కు మాగంటి గోపీనాథ్ వీరాభిమాని. ఎన్టీఆర్ తో కలిసి మాగంటి గోపీనాథ్ తిరిగారు. కమ్మ సామాజిక వర్గం ఓట్ల కోసం ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఒక్కటే హైదరాబాద్ నగరంలో ఉందా.? మిగతా నియోజకవర్గాలు లేవా సన్నబియ్యం,రేషన్ కార్డులు తప్ప సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడటంలేదు. బిఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని అంటే నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నా. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన భాష మార్చుకోవాలి. అన్నపూర్ణ అంటే కేసీఆర్కుటుంబం పేరు కాదు కాదా? అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చారు. దేశానికి రెండవ రాజధాని నగరం స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది.
ప్రభుత్వాన్ని సర్కస్ కంపెనీలా నడిపిస్తున్నారు. భయంతోనే అజహారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి రాజ్యాంగ బద్ధమైన సీఎం స్థానంలో ఉన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 4వేల కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో సీఎం చూపించాలి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకపోతే పధకాలు ఆగుతాయని అన్నారు.
ప్రజలను రేవంత్ రెడ్డి భయపెడుతున్నారా? సంక్షేమ పధకాలు ఆగితే పోరాటం ఎట్లా చేయాలో మాకు తెలుసు. అసెంబ్లీని ఏ విధంగా స్తంభింపచేయాలో మాకు తెలుసు. అసెంబ్లీలో మాట్లాడకుండా పనిచేసే ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. మాగంటి గోపీనాధ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు. మాగంటి గోపీనాధ్ చివరి వరకు ప్రజల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి అలవాట్లు అందరికీ ఉండవు. ప్రజలను భయపెడితే చూస్తూ ఊరుకోరు ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే పద్మారావు ,ఖైరతా బాద్ బీ ఆర్ ఎస్ ఇంచార్జీ మన్నె గోవర్ధన్ రెడ్డి కార్పొరేటర్లు సామల హేమ ,ప్రసన్న లక్ష్మి ,బీ ఆర్ ఎస్ నేత మహేందర్ పాల్గొన్నారు.