Suryaa.co.in

Andhra Pradesh

కోడికత్తి కేసును ఎన్‌ఐఏ నిశితంగా విచారణ చేస్తే ఇందులో ఏ1 ముద్దాయి జగన్ మోహన్ రెడ్డే

– తెదేపా పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య
– కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలంటే సమతా సైనిక్‌దళ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్
– సమావేశంలో పాల్గొన్న తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, సిపిఐ రామకృష్ణ, పోతుల బాలకోటయ్య

ఆంధ్రరాష్ట్రంలో అంటరానితనం విశృంఖలంగా ఉంది. కానీ, అది బహిర్గతం కాకుండా రాజకీయ మేలి ముసుగు దానిపైన కప్పబడి ఉందని వర్ల రామయ్య అన్నారు. కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలంటూ సమతా సైనిక్ దళ్ విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వర్ల రామయ్య పాల్గొన్నారు.

ఆ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడ్డ ఒక దళిత యువకుడు ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోవడం అంటరానితనమే. జనుపల్లి శ్రీను అనే దళిత యువకుడికి బెయిల్ రాకపోవడం అంటరానితనం తప్ప మరోటి కాదు. కోడికత్తి శ్రీను ఇతర అగ్రవర్ణాలకు చెందిన యువకుడైతే ఇన్నేళ్లు జైల్లో మగ్గిపోయేవాడు కాదు. ఇతర కుల సంఘాల మాదిరి దళిత సంఘాలకు ఆర్ధిక స్వావలంభన ఉండదు గనుకనే కోడికత్తి శ్రీను ఐదేళ్లుగా జైల్లో ఉన్నాడు.

భారతదేశ న్యాయ చరిత్రలో 307 సెక్షన్ కింద ఆరోపణ ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీగా ఐదేళ్లు జైల్లో ఉండటం ఎక్కడా, ఎన్నడూ జరగలేదు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి పీఠం అదిష్టించడానికి జగన్ మోహన్ రెడ్డి చేసిన కుట్రలో శ్రీను బలైపోయాడు. అధికారంలోకి రావడానికి జగన్ రెడ్డి తొక్కిన అడ్డదారులకు కోడికత్తి శ్రీను ఉదంతం ఒక మంచి ఉదాహరణ. జగన్ మోహన్ రెడ్డిని ఎవరో చంపబోయినట్లుగా…చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా ఒక ‘స్టేజ్ మేనేజేన్డ్ డ్రామా’ క్రియేట్ చేశారు.

ఎన్‌ఐఏ ఈ కేసు దర్యాప్తును నిశితంగా విచారనణ చేసినట్లైతే కోడికత్తి కేసులో ప్రధాన ముద్దాయి జగన్ మోహన్ రెడ్డే. ఈ కేసులో జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు హాజరై సాక్ష్యం ఎందుకు చెప్పడం లేదో అర్ధం కావడం లేదు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం శ్రీను అనే దళిత బిడ్డను వాడుకున్నాడు గనుక జగన్ మోహన్ రెడ్డిని ఏ1 గా చేర్చాలి.

LEAVE A RESPONSE