-ఉత్తమ ప్రభుత్వ పాలసీతో 25 ఏళ్లలో పేదరికం లేని సమాజం
-డిజిటల్ కరెన్సీ ద్వారా రాజకీయ అవినీతికి చెక్
-మోదీ ప్రభుత్వ పాలసీలను నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
-ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ నిర్వహించిన Time of Transformation: The need to keep fighting సమ్మిట్ లో పాల్గొన్న టీడీపీ అధినేత
-వివిధ అంశాలపై తన అనుభవాలు, అభిప్రాయాలు పంచుకున్న చంద్రబాబు నాయుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు న్యూ ఢిల్లీలో జరుగుతున్న రిపబ్లిక్ టీవీ సమ్మిట్ 3వ ఎడిషన్లో ఆన్ లైన్ విధానంలో పాల్గొన్నారు. సదస్సులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..
1. భారతదేశానికి 2050 వరకు డెమోగ్రాఫిక్ డివిడెండ్ (జనాభా నిష్పత్తి) ప్రయోజనం ఉంది. ప్రస్తుతం భారతీయ జనాభాలో 40% మంది 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. యువత ఎక్కువ కలిగిన దేశం మనది. ప్రభుత్వాలు వారి ఆకాంక్షలను నెర వేర్చడం ద్వారా, అందుకు అనుగుణంగా పాలసీలు తీసుకురావడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. దేశానికి యువత పెద్ద ఆస్తి.
2. ప్రస్తుతం టెక్నాలజీ పరంగా ఉచ్చ దశలో ఉన్నాం. సాంకేతికత విప్లవాన్ని తెస్తుందని మొదటి నుంచి నేను చెపుతూ వస్తున్నాను. నాలెడ్జ్ ఎకానమీ అనేది ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మారుతుంది.
3. సాంకేతిక విప్లవానికి హైదరాబాద్ ప్రయాణం నిదర్శనం. నేడు తెలంగాణ దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం పొందుతోంది. మైక్రో సాఫ్ట్ తీసుకురావడానికి నాడు నేను మన బలాలు ఎంటో బిల్ గేట్స్ కు వివరించాను. భారతీయులు గణితంలో, ఇంగ్లీషులో ప్రావీణ్యం కలిగిన వారు అని వివరించాను. దీంతో బిల్ గేట్స్ అంగీకరించి హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ను ఏర్పాటు చేశారు.
4. 2047 నాటికి భారతదేశాన్ని నంబర్ వన్ లేదా నంబర్ టూ ఆర్థిక వ్యవస్థగా మార్చవచ్చు. మనం ఆస్థాయికి చేరాలి అనేది నా కోరిక. ప్రధాన మంత్రి కూడా అదే కోణంలో ఆలోచిస్తున్నారు. అందుకే ప్రధాని మోదీతో ఏకీభవిస్తున్నాను. నేను ప్రధాని మోదీ పాలసీలను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయంలోనే మాత్రమే ప్రధానితో విభేదించాను. ప్రపంచం అంతా తిరగి మోదీ భారత్ ను బ్రాండ్ చేస్తున్నారు. దీనికి ఆయనను నేను పూర్తిగా అభినందిస్తున్నాను. మద్దతు ఇస్తున్నాను. నెట్వర్కింగ్ ద్వారా ప్రపంచ స్థాయిలో దేశానికి గుర్తింపు తెచ్చారు. ఆయన విజన్ తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
5. నాడు నేను విజన్ గురించి మాట్లాడితే నన్ను విమర్శించారు. కానీ విజన్ 2020 హైదరాబాద్లో సాకారం అయింది. సమాజం కోసం ముందుచూపుతో పనిచేసే నాయకులు ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటారు. గతంలో ప్రతిపక్షాలు నన్ను విమర్శించేవి.
6. ఇప్పుడు కూడా నేను విజన్ గురించి మాట్లుతుంటే విమర్శలు వస్తున్నాయి. సమాజంలో రాజకీయం కోణం వేరు…అభివృద్ధి వేరు అని నమ్ముతాను. దేశం,సమాజం శాశ్వతం, భారతదేశాన్ని నంబర్ వన్ చేయడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి. రాజకీయ పార్టీలు వేరు అయినా నేషన్ ఫస్ట్ అని నేను భావిస్తాను.
7. మన కరెన్సీలో ఉన్న రూ. 500 ఆపై నోట్లను రద్దు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. డిజిటల్ చెల్లింపుల వినియోగంలో నేడు మనం ఇతర దేశాల కంటే ముందున్నాం. పెద్ద నోట్లు రద్దు ద్వారా ఎన్నికల్లో డబ్బు పంపిణీ నివారించవచ్చు. రాజకీయాలలో పారదర్శకత వస్తుంది… రాజకీయ అవినీతిని నియంత్రిస్తే అది దేశానికి ఎంతో మేలు చేస్తుంది.
8.“భారతదేశంలో 30% మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. 2047 నాటికి ప్రతి భారతీయుడిని మధ్యతరగతి వ్యక్తిగా మార్చవచ్చు. PPPP విధానం ద్వారా ( పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్షిప్) మోడల్ తో ప్రతి కుటుంబానికి స్వల్పకాలిక, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయాలి. తద్వారా ప్రతి కుటుంబంలో మార్పు తీసుకునిరావచ్చు.
9. సంపదను పంపిణీ చేయడానికి, సంక్షేమాన్ని అందించడానికి సంపద సృష్టి అవసరమని నేను నమ్ముతాను. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ద్వారా పేదరిక నిర్మూలన అనేది సాధ్యం అవుతుంది. దాని కోసం ప్రత్యేక ప్రణాళికలను ప్రభుత్వాలు అమలు చేయాల్సి ఉంది.
10. మన నీటి వనరులను సమర్థంగా వినియోగించడం ద్వారా, వ్యవసాయానికి సాంకేతికత అందించడం ద్వారా సాగులో, రైతుల జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చు. రైతుల ఆకాంక్షలను సాకారం చేయడానికి నదుల అనుసంధానం, జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ (ZBNF) వంటి వాటిపై దృష్టిపెట్టాల్సి ఉంది.
11. మన మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్ల కారణంగా పౌల్ట్రీ, ఆక్వాకల్చర్, హార్టికల్చర్ మొదలైన వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడం ద్వారా రైతాంగానికి మేలు చేయవచ్చు.
12. దేశంలో సరైన విధానాలు రూపొందించడం, అమలు చేయడం ద్వారా అమెరికా, చైనాలను దాడి ఇండియా ప్రపంచ నెంబర్ 1 దేశం అవుతుంది. అతిపెద్ద ఎకానమీ అయ్యే అవకాశం ఉంది.
13.”2047 నాటికి భారతదేశం దారిద్య్ర రేఖకు ఎగువకు రావాలి అనేది నా ఆకాంక్ష. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన జాతిగా భారతీయులు వెలగాలి. దీనికి అన్ని అర్హతలు, అవకాశాలు మనకు ఉన్నాయి. అందుకు అనుగుణంగా ప్రయాణం సాగించాల్సి ఉంది.