– ‘ఆపరేషన్ సిందూర్’ను స్వాగతించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు: ప్రపంచ శాంతికి విఘాతంగా మారిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించడమే భారత్ లక్ష్యం అని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పిఓకే ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ప్రతీకార దాడిని ఎంపీ మహేష్ కుమార్ స్వాగతించారు.
ఏలూరు శాంతినగర్ లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత సైన్యం ప్రతీకార దాడి నిర్వహించిన కొన్ని గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమై తదుపరి చర్యలపై చర్చించిందని ఎంపీ తెలిపారు. సైన్యం నిర్వహించిన ఆపరేషన్ను కేంద్ర మంత్రివర్గంతో పాటు యావత్ భారత్ జాతి ప్రశంసించిందని ఎంపీ పేర్కొన్నారు.