Suryaa.co.in

Andhra Pradesh

కసాయి ముఖ్యమంత్రి…కసాయి ప్రభుత్వానికి రాష్ట్రంలోని కరువు…రైతుల దుస్థితి కనిపించకపోవడం దురదృష్టకరం

• కరువు మండలాలు ప్రకటిస్తూ ప్రభుత్వమిచ్చిన జీవో నెం-4 నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు
• కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ కు సంబంధించి ప్రతివారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులపై సమీక్ష చేయాలి
• ముఖ్యమంత్రి.. మంత్రులకు అసలు ఆ మార్గదర్శకాలు ఏమిటో..కేంద్ర ప్రభుత్వ ఆలోచనలేమిటో కూడా తెలియవు
• కేవలం 20 రోజుల్లోనే మొక్కుబడిగా కరువు మండలాలు ప్రకటించడం, రైతాంగంపై..వ్యవసాయంపై ముఖ్యమంత్రి.. మంత్రుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం
• కర్ణాటక ప్రభుత్వం కరువు వల్ల తమ రాష్ట్రంలో రూ.30 వేలకోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి నివేదికలు ఇస్తే.. జగన్ సర్కార్ ఇప్పటికీ రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై ఎందుకు కేంద్రానికి నివేదికలు పంపలేదు?
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

ఈ సంవత్సరం రైతాంగం లక్షలాది ఎకరాల్లో పంటలు వేయకపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని.. రైతాంగం విషయంలో పాలకుల వైఖరి చాలా దారుణంగా ఉందని, డ్రాట్ మాన్యువల్ (కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలు) ప్రకారం క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ కు సంబంధించి ప్రతివారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితి.. సాగునీరు.. విద్యుత్ .. వేసిన పంటలపై సమీక్ష చేయాలని.. కానీ జగన సర్కార్ మొత్తం వ్యవసాయ రంగాన్నే గాలికి వదిలేసిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ధూళి పాళ్ల నరేంద్రకుమార్ చెప్పారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

“ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు రైతుల్ని ఆదుకోవడానికి అనేక చర్యలు చేపట్టింది. జగన్ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడమే మర్చిపోయింది. ఒక్కమాట చెప్పాలంటే వ్యవసాయశాఖ రాష్ట్రంలో చచ్చిపోయిందనే చెప్పాలి.

ముఖ్యమంత్రి అనే పదవిపై వ్యామోహం తప్ప.. ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి ఏం చేయాలో..రైతుల విషయంలో ఎలావ్యవహరించాలో కూడా జగన్ రెడ్డికి తెలియదు. ఇరిగేషన్ శాఖ మంత్రి తనశాఖకు సంబంధించిన నిజాలు బయటకు చెబితే.. తన త ల వెయ్యి ముక్కలవుతుందేమో అన్నంతగా భయపడిపోతున్నాడు. వ్యవసాయశాఖ మంత్రి అయితే మాటమాత్రంగా కూడా రైతుల గురించి స్పందించడు. అసలు ఆయన రాష్ట్రంలో ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితి.

రాష్ట్రంలో 470 మండలాల్లో వర్షాభావ పరిస్థితులుంటే.. ప్రభుత్వం మొక్కుబడిగా 103 మండలాలు ప్రకటించి చేతులు దులుపుకుంది
రాష్ట్రవ్యాప్తంగా 470 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటే.. జగన్ ప్రభుత్వం కేవలం 103 మండలాల్లో మాత్రమే వర్షాభావ పరిస్థితులు ఉన్నట్టు ప్రకటించింది. ఆ 103 మండలాల్లో 80 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రాంతాలవారీగా పడాల్సిన వర్షం…పడిన వర్షాన్ని లెక్కలోకి తీసుకోకుం డా ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించడం బాధాకరం. జీవో నెం- 4ద్వారా కరువు మండలాలు ప్రకటించడం తప్ప.. రైతులకోసం.. కరువు పరిస్థితుల నివారణ కోసం ప్రభుత్వం పైసా కూడా నిధులు ఇవ్వలేదు.

జీవో-4 నాలుక గీసుకో వడానికి తప్ప దేనికి పనికిరాదు. డ్రాట్ మాన్యువల్ ప్రకారం కరువు మండలాల ప్రకటన అనేది అక్టోబర్ 30 లోపు జరగాలని కేంద్రప్రభుత్వ నిబంధనలు చెబుతుంటే, జగన్ ప్రభుత్వం మాత్రం నింపాదిగా 31 అక్టోబర్ న ప్రకటించింది. కేవలం రైతుల్ని మోసగించడానికే జగన్మోహన్ రెడ్డి.. వైసీపీప్రభుత్వం మొక్కుబడిగా కరువు మండలాల జాబితా ప్రకటించింది? రాష్ట్రంలో 470 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటే, కేవలం 100 మండలాలు మాత్రమే ప్రకటించడం మొక్కుబడి వ్యవహారం కాదా?

ఊళ్లకు ఊళ్లు వలసపోయి రైతులు చనిపోయేవరకు జగన్మోహన్ రెడ్డి..మంత్రులు స్పందించరా?
రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో ఊళ్లకు ఊళ్లు బతుకుదెరువు కోసం వలసవెళ్తున్నా జగన్మోహ న్ రెడ్డిలో చలనం లేదు. తెలంగాణ ప్రభుత్వం పక్కరాష్ట్రంలో ధాన్యం కొనే దిక్కులేదని ఎద్దేవా చేస్తున్నా ఈ ముఖ్యమంత్రికి సిగ్గులేదు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో జూలైలోనే కరువు మండలాలు ప్రకటించినా.. కర్ణాటక ప్రభుత్వం కరువు వల్ల తమరాష్ట్రంలో రూ.30 వేలకోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి మొరపెట్టు కుంటే.. జగన్ సర్కార్ మాత్రం ఈనాటికీ కేంద్రప్రభుత్వానికి రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై ఎందుకు నివేదిక ఇవ్వలేదు?

వైసీపీ ప్రభుత్వం నివేదికలు పంపే దెప్పుడు.. కేంద్ర బృందాలు రాష్ట్రానికి వచ్చేదెప్పుడు..రైతుల కష్టాలు తెలుసుకు నేదెప్పుడు? ఆర్థిక సహాయం అందించేదెప్పుడు? ఊళ్లకుఊళ్లు ఖాళీ అయిపోయి.. దిక్కుతోచనిస్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవరకు ముఖ్యమంత్రి..మంత్రులు స్పందించరా?

రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం 70శాతానికే ఎందుకు పరిమితమైందని ప్రభుత్వం ఎప్పుడైనా సమీక్ష చేసిందా?
రాష్ట్రంలో ఏ పంటలు అయితేనేమీ 36 లక్షల ఎకరాల్లో వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కేవలం 24 లక్షల ఎకరాల్లో మాత్రమే (అంటే కేవలం 70శాతం) పంటలు వేసినా ప్రభుత్వంలో ఎందుకు స్పందన లేదు? పంటలసాగు ఎందుకు జరగలే దు.. రైతులకు వచ్చిన సమస్యలేమిటనే దిశగా జగన్ రెడ్డి ఏనాడూ ఆలోచన చేయలేదు.

కరువు మండలాలకు సంబంధించి కలెక్టర్లు.. రాష్ట్రంలో470 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని నివేదిక ఇస్తే.. ప్రభుత్వం కేవలం 103 మండలాలు.. అవి కూడా మొక్కుబడిగా ప్రకటించడం రైతుల్ని వంచించడం కాదా? వర్షాభావ పరిస్థితుల తో రాష్ట్రమే కరువుకోరల్లో చిక్కి, రైతాంగం అల్లాడుతుంటే, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి.. నీటివసతికి.. పంటనష్టానికి జగన్ ప్రభుత్వం ఒక్కరైతుకి రూపాయి సాయం చేసింది లేదు.

కుండల్లో నీళ్లుపోయడం కాకుండా.. పొలాల్లో నీళ్లు పారించడంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి
జలవనరుల అంతర్జాతీయ సదస్సు పేరుతో కేంద్రమంత్రితో కలిసి విశాఖపట్నంలో దేశంలోని వివిధ నదుల నీళ్లను కుండలో నీళ్లు పోస్తున్న ముఖ్యమంత్రికి.. రాష్ట్రంలోని రైతులకు నీళ్లు అందించాలి.. పంటపొలాల్లో నీళ్లు పారించాలనే కనీస ఇంగితం లేకపోవడం దురదృష్టకరం. ముఖ్యమంత్రికి..మంత్రులకు రైతులపై ఏమాత్రం జాలి, దయ లేవు అనడానికి వారు ప్రవర్తిస్తున్న తీరే నిదర్శనం. రైతుల గోడు పట్టించుకొని.. వారికి పైసా సహాయం చేయని ముఖ్య మంత్రి.. తనను తాను ప్రజల్లో గొప్ప నాయకు డని ప్రచారం చేసుకోవడానికి మాత్రం వందలకోట్ల ప్రజలసొమ్ము తగలేస్తున్నాడు.

ఇంత కసాయి, కర్కోటక ముఖ్యమంత్రిని రాష్ట్ర చరిత్రలో ఇంకెప్పటికీ చూడలేము. ఈ ముఖ్యమంత్రి తీరుతో.. ప్రభుత్వ చేతగాని తనంతో..మంత్రుల వైఖరితో ఏంచేయాలో తెలియక రైతులు ఏమిటీ ఖర్మ అని గుండెలు బాదుకుంటూ బోరున విలపిస్తున్నారు. రైతులు రోదిస్తుంటే… ముఖ్యమంత్రి రాష్ట్రం సుభిక్షంగా ఉందని.. రైతుల సంతోషంగా ఉన్నారని ఎలా చెబుతారు?

ఎస్.డీ.ఆర్.ఎఫ్ నిధులు రూ.500కోట్లు వస్తే.. వైసీపీప్రభుత్వం రైతులకు రూపాయి ఇవ్వలేదు
ఎస్.డీ.ఆర్.ఎఫ్ కింద కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి జూలైలో రూ.500 కోట్లు విడుదల చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం పంటలు కాపాడటానికి..తాగునీటివసతి కల్పనకు రూపాయి ఇవ్వలే దు. నేడు రైతులు ఒక ఎకరా మిర్చిని కాపాడుకోవడానికి కేవలం నీళ్ల ట్యాంకర్లకే రూ. 40 వేలనుంచి రూ.50వేల వరకు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి. కేంద్రప్రభుత్వం రైతుల సంక్షేమానికి.. వ్యవసాయరంగానికి ఇస్తున్న నిధులు ఎటుపోతున్నామో వైసీపీ ప్రభు త్వం సమాధానం చెప్పాలి.

కేవలం 20 రోజుల్లోనే మొక్కుబడిగా కరువు మండలాలు ప్రకటించడం, రైతాంగంపై..వ్యవసాయంపై ముఖ్యమంత్రి.. మంత్రుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం
కరువు మండలాలు ప్రకటిస్తూ ప్రభుత్వమిచ్చిన జీవోనెం-4లో నెల్లూరు జిల్లాలో ఒక్క కరువు మండలం కూడా ఎందుకులేదో.. ఆ జిల్లాకు చెందిన వ్యవసాయమంత్రే చెప్పాలి . ఉదయగిరి మండలంలో తాండవిస్తున్న కరువు ప్రభుత్వానికి..వ్యవసాయమంత్రికి కనిపించలేదా? ప్రభుత్వమిచ్చిందో తప్పుడు జీవో అయితే.. దాన్ని మరలా క్షేత్రస్థాయి లో వెరిఫై చేయాలని అధికారులకు చెప్పడం ఏమిటి?

జీవోనెం-4ను ప్రభుత్వం హడా వుడిగా విడుదలచేసింది. రాష్ట్రస్థాయిలో కరువు మండలాలు పరిశీలించడానికి ఒక కమిటీ నియమిస్తున్నట్టు ప్రభుత్వం జీవోనెం-3 ద్వారా అక్టోబర్ 10న ఆదేశాలు వెలువరించింది. అక్టోబర్ 17న అందరికీ లేఖలు రాసిన ప్రభుత్వం .. అక్టోబర్ 25న కలె క్టర్ల ద్వారా నివేదికలు కావాలని మీటింగ్ లు పెట్టింది. 31వ తేదీన ఫైనల్ గా కరువు మండలాలు ప్రకటిస్తూ.. జీవోనెం-4 విడుదల చేయడం జరిగింది.

అంతా కేవలం 20 రోజుల్లోనే ప్రభుత్వం ఆఘమేఘాలపై ఎవరి కన్నీళ్లు తుడవడానికి కరువు మండలాలు ప్రకటించింది? రైతాంగం.. వ్యవసాయం విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారో చెప్పడానికి ఈ జీవోలే నిదర్శనం.

టీడీపీ-జనసేన నేతలు రైతుల్ని కలిసి వారి కష్టాలు, బాధలు తెలుసుకొని ప్రభుత్వం కళ్లు తెరిపిస్తారు
మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడి నేత్రత్వంలో టీడీపీ రైతు విభాగం సమావే శమైంది. ఆ సమావేశంలో కరువు మండలాల్లో టీడీపీ రైతు విభాగం పర్యటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతుల్ని కలిసి.. వారి బాధలు కష్టాలు ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యాచరణతో టీడీపీ ముందుకెళ్తుంది. ఈ ప్రక్రియలో జనసేన ను కూడా కలుపుకొని తెలుగుదేశం ముందుకెళుతుంది.” అని ధూళిపాళ్ల స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE