Suryaa.co.in

Andhra Pradesh

ఆరోగ్యశ్రీలో కూడా జగన్ నాటకమే

• కమీషన్లు దండుకుని ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత జగన్ రెడ్డిదే
• బకాయిలు కట్టని ప్రభుత్వం… ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేసిన ప్రైవేట్ ఆసుపత్రులు
• కేంద్రం నుండి వచ్చిన నిధులను దారి మళ్లించిన జగన్ రెడ్డి
• ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా.. అస్మదీయులకు రూ. 15వేల కోట్ల వరకు కట్టబెట్టిన జగన్ రెడ్డి
• ఓట్లకోసం డాక్టర్లను వాడుకుని గ్రామాల్లో ప్రచారం
• ఓటమి భయంతో రాష్ట్రంలో రాక్తపాతం సృష్టించిన వైసీపీ నేతలు
• అరాచకం సృష్టించి వైసీపీ నేతలు.. బుద్ధి లేకుండా బయటకు వచ్చిన మాట్లాడుతున్న వైసీపీ నేతలు జోగి, అంబటి
• మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత జగన్ రెడ్డిదే.. ప్రజల ఆరోగ్యాన్ని జగన్ గాలికి వదిలేశాడు. ఆసుపత్రులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు రూ.1500 కోట్లు చెల్లించకుండా.. దాదాపు రూ.15000 కోట్లు తన అస్మదీయులకు తరలించాడు. ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీని నిలిపివేయటం జగన్ పాలన వైఫల్యానికి సాక్ష్యమని మాజీ మంత్రి దేవినేన ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ..ఆరోగ్య శ్రీ బకాయిలపై వైసీపీ ప్రభుత్వం స్పందించడంలేదు. దాదాపు 15 నెలలుగా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఒప్పందం ప్రకారం 45 రోజుల్లో బిల్లులు చెల్లించాలి. బిల్లులు రాకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలను ఆసుపత్రులు నిలిపేశాయి. బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదు. ఆసపత్రులకు డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడంపై పేదల ఆరోగ్యం పట్ల జగన్ కు ఉన్న చిత్త శుద్ధి ఏంటో అర్థం అవుతుంది.

చంద్రబాబు పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. ఎన్టీఆర్ వైద్యం సేవ పథకం కింద నిధుల్లో 45 శాతం రోగికి ఆసుపత్రి ఖర్చులకు ఇచ్చేవాళ్లం, 35 శాతం సర్జరీలకు డాక్టర్లకు ప్రోత్సహకంగా ఇచ్చేవాళ్లం, 25 శాతం ఖాతాల్లో ఉంచి అవసరాలను బట్టి బోధన ఆసుపత్రులకు కేటాయించి పేదల ఆరోగ్యాన్ని కాపడటానికి చర్యలు తీసుకున్నాం. నేడు అడ్మిస్ట్రేషన్ ఆసుపత్రులు 13, మానిటరింగ్ ఆసుపత్రలు 16 అంటూ అసలు అర్థం కాకుండా కొడి కత్తి డాక్టర్ ను ఆసుపత్రి కమిటీలకు చైర్మన్ గా పెట్టి పేదల ఆరోగ్యంతో ఆడుకున్నారు. 1000 కోట్లకు పైగా కొట్టేశారు.

కోడి కత్తి డాక్టర్ రికమండ్ చేసిన ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కార్యాలయం బిల్లులు క్లియర్ చేస్తే వాటిల్లో కూడా పర్సంటేజీలు దోపిడీలకు పాల్పడ్డారు. నేడు కట్టే ఆసుపత్రులు, మెడికల్ కాలజీల్లో రూ.300 కోట్లు కమీషన్ లు దండుకున్నారు. ఆ డబ్బులు కట్టినా నేడు ఆరోగ్య శ్రీ సేవలు ఆగేవి కావు. జగన్ రెడ్డి అనుంగుల దోపిడీకి అడ్డులేకుండా పోయింది. 104 సేవలను నీరుగార్చారు. 108 సేవలను గాలికొదిలేశారు. ఫ్యామిలీడాక్టర్, సురక్ష పేర్లు పెట్టుకుని సేవలు మరిచారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు. దాదాపు 30వేల మంది మరణానికి కారణమైయ్యారు.

ఓట్లు దండుకోవడానికి డాక్టర్లను వాడుకుని గ్రామాలకు పంపి ప్రచారం చేయించారు. వీటిపైన సమీక్షిస్తాం. తప్పకుండా చర్యలు ఉంటాయి. పర్సంటేజీల కోసం మీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎవరెవరికి ఏం చేశారో అవి అన్నీ బట్టబయలు అవుతాయి. పీఎమ్జేవై కింద ఒక్కోక్క ప్యామిలీకి కేంద్రం నుండి వచ్చి రూ.ఐదు లక్షలను ఏం చేశారో లెక్కల్లో కనిపించడంలేదు. ఈ వాస్తవాలను బయటపెడతాం. వెంటనే చీఫ్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీలు స్పందించి ఆసుపత్రులకు కట్టాల్సిన బకాయిలను కట్టాలి. పేదల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

రాష్ట్రంలో రక్తపాతం సృష్టించి.. 10 రోజుల తరువాత బయటకు వచ్చిన వైసీపీ నేతలు జోగి రమేష్, అంబటి రాంబాబులు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. టీడీపీ నేతలపై నోరు పారేసుకుంటున్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అరాచకాలకు కారకులైన వారిని వెంటనే సిట్ అధికారులు అరెస్ట్ చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.

LEAVE A RESPONSE