Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వ వైఫల్యం వల్లే పెద్ద మొత్తంలో పంట నష్టంతో పాటు ప్రాణ,ఆస్తి నష్టం

– కుప్పంలో దొంగ ఓట్లు వేయించటంపై ఉన్న శ్రద్ద వరద బాధితులను ఆదుకోవటం లేదు
– జగన్ రెడ్డి….బురద రాజకీయాలు ఆపి వరద బాధితులను ఆదుకోండి
– టీడీపీ కార్యకర్తలు, నాయకులు బాధితులకు ఆపన్న హస్తం అందించాలి
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో వర్షాలు, వరదలు కారణంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టంతోపాటు, ప్రాణ, ఆస్తి ‎ నష్టం జరిగింది. కడప జిల్లాలో 30 మంది గల్లంతవ్వగా 12 మంది చనిపోయారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‎వరదల వల్ల ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో బిక్కుబిక్కుమంటు రోడ్లపై ఉన్నారు.
రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ముఖ్యమంత్రి వరదల పై శద్ర పెట్టకుండా బురద రాజకీయాలు చేస్తూ ఎదుటివారిపై బురద చల్లే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు. జగన్ రెడ్డికి కుప్పంలో దొంగ ఓట్లు వేయించటంపై ఉన్న శ్రద్ద వరద బాధితులను ఆదుకోవటం లేదు. కుప్పంలో ఎన్నికల నాడు పొరుగు రాష్ట్రాల నుంచి బస్సుల్లో జనాల్ని తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించారు, కానీ ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం పక్క జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చి సహాయం అందించటం లేదు.
రాష్ట్రానికి వరద ముప్పు ఉందని తెలిసినా ముఖ్యమంత్రి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యహవరించటం వల్లే ఇంత పెద్ద మెత్తంలో పంట, ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ‎వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడడంతోపోటు వెంటనే సహాయ చర్యలు చేపట్టాలి. చనిపోయిన వారి ‎ కుటుంబాలకు తక్షణమే ఆర్దిక సాయం అందించాలి. ఆరుగాలం శ్రమించి చేతికందిన పంట నీట మునగటంతో అన్నదాతలు ఆవేదన, ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం తక్షణమే పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి.వరదల వల్ల అన్ని కోల్పోయి ఆపన్న హస్తం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు నాయకులు, బాధితులకు అండగా నిలబడి సహాయ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి.

LEAVE A RESPONSE