రైతుభరోసా కేంద్రాల మసుగులో వ్యవసాయాన్ని జగన్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నాడు

– చంద్రబాబు రైతులకు అమలుచేసిన పథకాలు ఎందుకు రద్దుచేశాడో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
• పంటలకు గిట్టుబాటుధర, ఎరువులు, సూక్ష్మపోషకాలు, విత్తనాల పంపిణీ, మైక్రో ఇరిగేషన్, ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా వంటి వాటిని జగన్ రెడ్డి అటకెక్కించాడు
• మైక్రోన్యూట్రియంట్స్ పంపిణీ, పంటలబీమా, గిట్టుబాటు ధర కల్పనకు డబ్బులేదంటున్న జగన్ రెడ్డి, మోటార్లకు మీటర్లు పెట్టడానికి మాత్రం రూ.6వేలకోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధమయ్యాడు
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
• జగన్ రెడ్డి తలతిక్క నిర్ణయాలతో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిందన్న టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ
• రాష్ట్ర రైతాంగం వెతలు, వ్యవసాయరంగం దుస్థితిపై సవివరమైన నివేదిక తయారుచేసి, ప్రభుత్వం ముందు పెట్టనున్న టీడీపీ స్టీరింగ్ కమిటీ
• వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో సీబీఐ దూకుడుతో మతిభ్రమించే జగన్ రెడ్డి విశాఖపట్నమే రాజధాని అంటున్నాడని ఎద్దేవాచేసిన కమిటీసభ్యులు

టీడీపీ జాతీయకార్యాలయంలో మంగళవారం రైతులసమస్యలు, రాష్ట్ర వ్యవసాయరంగంపై అధ్యయనానికి టీడీపీ ఏర్పాటుచేసిన వ్యవసాయ స్టీరింగ్ కమిటీ సభ్యులు విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారిమాటల్లోనే …

కడప జిల్లా రైతులకు బిందుతుంపర సేద్యం పరికరాలు అందించలేని జగన్ రెడ్డి, రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దరిస్తాడా? : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి)
“టీడీపీ స్టీరింగ్ కమిటీ రాష్ట్రంలో రైతుసమస్యలపై చర్చించింది. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మూతపడింది.
• బడ్జెట్ లో కేటాయించిన మొత్తంనిధుల్లో 10, 15 శాతం హెచ్చుతగ్గులు ఉండటం సహజం.
• కానీ వ్యవసాయశాఖకు 2020-21లో రూ.20వేలకోట్లు కేటాయించి, రూ.7వేల కోట్లు ఖర్చుచేసినప్పుడే జగన్ రెడ్డికి రాష్ట్ర రైతులపై ఎంత శ్రద్ధ ఉందో అర్థమైంది.
• ఇంకా దారుణం ఏమిటంటే ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటఉత్పత్తులు అమ్ముకునే విషయంలోకూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
• ధాన్యం రైతులే ఒక్క సంవత్సరంలో ఎం.ఎస్.పీ కంటే రూ.60వేలకోట్లు నష్టపోయారని, సీఏసీపీ (కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్) నివేదికే చెప్పింది.
• ఏపీలోని ధాన్యం రైతులు క్వింటాల్ కు 11శాతం (రూ.213) నష్టపోయారని కూడా నివేదిక చెప్పింది.
• నెల్లూరు జిల్లాలో ధాన్యం రైతులు క్వింటాకు రూ.400 నష్టపోయారు. ధాన్యం కొన్న 6, 7 నెలలకు రైతులకు డబ్బులిచ్చారు.
• అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఇంతభారీస్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి.
• గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో ధాన్యం రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తే పట్టించుకున్నవారు లేరు. వ్యవసాయమంత్రి సీబీఐ భయంతో దాక్కున్నాడు.
• తెలంగాణలో అక్టోబర్ 21కి 64లక్షల30వేల టన్నుల ధాన్యం కొన్నారు. దాదాపు 70లక్షల టన్నులు కొన్నారు.
• అక్కడ రూ.13,570లు మూడోరోజునే రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు.
• ఏపీలో ఈ సంవత్సరం ఖరీఫ్ లో 90లక్షల టన్నులు దిగుబడి వస్తే, కొనుగోలు లక్ష్యం మాత్రం 30లక్షల టన్నులే ఎందుకు పెట్టారు? కేవలం 29లక్షల టన్నులే ఎందుకు కొన్నారు?
• పక్క రాష్ట్రంలో 70లక్షల టన్నులు కొంటే, ఏపీలో 29లక్షల టన్నులే కొంటారా?
• రాష్ట్రంలో కౌలురైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ క్రాప్ బుకింగ్ పేరుతో కౌలురైతుల గొంతులు కోస్తున్నారు.
• జాతీయస్థాయిలో అమలవుతున్న మైక్రో ఇరిగేషన్ ఎందుకు నిలిపేశారు?
• 5 ఎకరాలకు 70శాతం సబ్సిడీ ఉంటే, చంద్రబాబు దాన్ని 10ఎకరాలకు పెంచి 90శాతం సబ్సిడీ అందించారు. 2018లో మైక్రో ఇరిగేషన్ లో ఏపీ నంబర్ 1 గా నిలిచింది.
• గతంలో కడప రైతులు చంద్రబాబు అందించిన బిందుతుంపర సేద్యంతో అద్భుతాలు సృష్టించామని, అవే పరికరాలు అందించాలని వ్యవసాయమంత్రిగా ఉన్న కన్నబాబుని అడిగితే, ఆయన దానిగురించి ముఖ్యమంత్రికి చెబితే, నవరత్నాలు గురించి తప్ప, ఇంకోదాని గురించి మాట్లాడవద్దంటూ జగన్ రెడ్డి, కన్నబాబుపై అసహనం వ్యక్తంచేసింది నిజంకాదా? దాంతో మంత్రిగా ఉన్నకన్నబాబు రైతులకు ఏమీచెప్పలేక తాను నిస్సహాయుడిని అంటూ చేతులెత్తేశాడు.
• సొంత జిల్లా రైతులకే న్యాయంచేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రం గురించి ఆలోచిస్తాడా?
• చంద్రబాబు మైక్రో న్యూట్రియంట్స్ ను ఉచితంగా అందిస్తే, జగన్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఆపేసింది.
• అలానే సోలార్ పంప్ సెట్స్, ఐఎస్ఐ మార్క్ మోటార్స్ ఫ్రీగా అందించాము. వ్యవసాయ మోటార్లను రైతులు మొబైల్ ఫోన్లతో ఆన్ చేసుకునే సౌకర్యం కల్పిస్తే. వాటినికూడా ఆపేశారు.
• ఇన్ పుట్ సబ్సిడీని కేంద్రప్రభుత్వం ఎన్.డీ.ఆర్.ఎఫ్ నిబంధనలప్రకారం నిర్ణయిస్తే, దానికి అదనంగా టీడీపీప్రభుత్వం అందించింది.
• హెక్టార్ వరి సేద్యానికి రూ.15వేలుంటే, దాన్ని రూ.20వేలు చేశాము.
•టీడీపీహాయాంలో ఎకరావరి సాగుకి రూ.18 నుంచి రూ.20వేలు అయితే, ఇప్పుడు రూ.30 నుంచి రూ.35వేలు అవుతోంది.
• టీడీపీప్రభుత్వం రైతులకు అమలుచేసిన పథకాలన్నీ తీసేస్తారా?
• రాష్ట్రం విడిపోయి, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా లెక్కచేయకుండా టీడీపీప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి రూ.60వేలకోట్లు ఖర్చుచేసింది.
• ఈ నాలుగేళ్లలో జగన్ రెడ్డి కేవలం రూ.19వేలు మాత్రమే ఖర్చుపెట్టి, ఇరిగేషన్ రంగాన్ని నాశనం చేశాడు.
• మంత్రుల కమిటీ వేసి ఆక్వారంగాన్ని కుప్పకూల్చారు. ఆక్వారైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చింది.
• మైక్రో ఇరిగేషన్, యంత్రపరికరాలు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంట.. రైతుల మోటార్లకు మీటర్లు బిగించడానికి మాత్రం వేలకోట్లు ఖర్చుచేస్తారంట?
• రైతులు తిరగబడి, ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.
• మహారాష్ట్ర, కర్ణాటక మనకంటే పెద్ద రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువున్నాయి కాబట్టి ఏపీ మూడోస్థానంలో ఉందంటున్నారు.
• రైతుల సంఖ్య ప్రకారం చూస్తే, రైతు ఆత్మహత్యల్లో ఏపీదే తొలిస్థానం. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రానిది రెండోస్థానం.
• సీబీఐ కేసుల్లో మునిగిన వ్యవసాయమంత్రికి రైతుల గురించి పట్టించుకునే తీరిక లేదు.
• ఈ విధంగా రైతుల వేదన, వ్యవసాయరంగ దుస్థితిపై ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నాం. దాన్నే మీడియాకు కూడా ఇస్తున్నాం.
• రాజధాని విషయంలో జగన్ రెడ్డి మరోసారి పచ్చిమోసగాడని నిరూపించుకున్నాడు.
• ప్రతిపక్షనేతగా అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక భూములిచ్చిన రైతుల ఉసురు పోసుకునేలా వ్యవహరిస్తున్నాడు.
• రాజధాని అంశం కోర్టులో విచారణలో ఉండగా, జగన్ రెడ్డి ఇన్వెస్టర్ల సమ్మిట్ లో పెట్టుబడులు పెట్టడానికి విశాఖకు రావాలని, విశాఖే రాజధాని అని పారిశ్రామికవేత్తలకు చెప్పడం ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే అవుతుంది.
• జగన్ రెడ్డి నియంత పాలన ఎన్నోరోజులు సాగదు. ప్రజల ఆమోదంతో పనిలేకుండా ప్రతిసారి జగన్ రెడ్డి మాటతప్పి, మడమతిప్పుతూనే ఉన్నాడు.
• ఇప్పటికీ రాష్ట్రంలో ఎరువుల కొరత ఉంది. మొక్కజొన్న రైతులు యూరియాకోసం గుంటూరులో రోడ్డెక్కారు.
• పంటలబీమా సొమ్ము ప్రభుత్వం చెల్లించకపోవడంతో, రైతులు పంటనష్టంతో తీవ్రంగా దెబ్బతిన్నారు.
• అనంతపురంలో పంటలబీమా కింద రూ.2900కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్పిన జగన్ రెడ్డి, ఎంత మొత్తం రైతులఖాతాల్లో జమచేశాడో చెప్పాలి.
• మోటార్లకు మీటర్ల పేరుతో జగన్ రెడ్డి రూ.6వేలకోట్లు కాజేయడానికి సిద్ధమయ్యాడు.
• రైతులకు ఉచిత విద్యుత్ లేకుండా చేయడానికే ప్రభుత్వం వ్యవసాయమోటార్లకు మీటర్లు పెట్టడానికి సిద్ధమైంది.
• జగన్ రెడ్డి పాలన రైతులకు చీకటిరోజులే మిగిల్చింది.
• ధాన్యాగారంగా పిలువబడే రాష్ట్రం వ్యవసాయం చేయలేని పరిస్థితికి వచ్చింది.
• ధాన్యం పండించడంలో అగ్రస్థానంలో ఉండే గోదావరి జిల్లాల రైతులు వరిసాగుపై విముఖత చూపుతున్నారు.
• గోదావరి రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి రావడానికి జగన్ రెడ్డి రైతు వ్యతిరేకపాలనే కారణం.
• ప్రభుత్వం చెబుతున్న ఈక్రాప్ నమోదులో కౌలురైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.
• కౌలురైతులకు గుర్తింపుకార్డులు లేకపోవడంతో, ఈక్రాప్ లో వారి వివరాలు నమోదు చేయడంలేదు.
• దాంతో వారు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటుధరకు అమ్ముకునే పరిస్థితిలేదు.
• రైతులు పండించిన ఉత్పత్తుల కొనుగోలుకు జగన్ ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు పెడుతోంది.
• ఎక్కడ రూపాయి ఎక్కువస్తే, అక్కడ అమ్ముకునే వెసులుబాటు లేక రైతాంగం లబోదిబోమంటోంది.
• తేమశాతం పేరుతో ధాన్యం రైతుల్ని జగన్ ప్రభుత్వం దోచుకుంటోంది.
• ధాన్యం అమ్ముకోవడానికి రైతులు మిల్లర్లకు ఎదురు డబ్బులు కడుతున్నారు.
• రాష్ట్రవ్యాప్తంగా నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం, కాలువలు, డ్రైన్లలో ఎలాంటి పూడికతీత పనులు చేయలేదు.
• టీడీపీప్రభుత్వం రైతులకు అందించిన మైక్రో న్యూట్రియంట్స్ పంపిణీ, యాంత్రీకరణ పరికరాల పంపిణీ, ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా వంటి వాటిని జగన్ సర్కార్ అటకెక్కించింది.
• జగన్ తలతిక్క నిర్ణయాలతో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని స్థితిలో విలవిలలాడుతోంది.

నల్లి, గులాబి పురుగుతో నష్టపోయిన రైతులతో ఫిబ్రవరి 2న రచ్చబండ నిర్వహిస్తాం : మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి (తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు)

• రాష్ట్ర వ్యవసాయరంగం ముందున్న సవాళ్లను టీడీపీ స్టీరింగ్ కమిటీ చర్చించింది.
• రైతు గెలవాలి-వ్యవసాయం నిలవాలన్న చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా రైతులతో చర్చించి ప్రణాళికలు తయారుచేశాము. జగన్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని అవమానిస్తోంది.
• రైతుల భూముల పత్రాలపై తనబొమ్మలు వేయడం, హద్దురాళ్లపై తనచిత్రాలు వేయాలన్న నిర్ణయాన్ని జగన్ వెనక్కు తీసుకోవాలి.
• భూసర్వే పేరుతో జగన్ ప్రభుత్వంలోని బ్రోకర్లు రైతులభూములు కొట్టేయడానికి సిద్ధమయ్యారు.
• నల్లి, గులాబిపురుగుతో నష్టపోయిన మిర్చి, పత్తిరైతులతో ఫిబ్రవరి2న రచ్చబండ నిర్వహించబోతున్నాం.

Leave a Reply