Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డీ.. హత్యా రాజకీయాలకు కాలం చెల్లింది

– ఓటమి భయంతోనే దస్తగిరి కుటుంబంపై జగన్ రౌడీలు దాడి
– బాబాయి బాత్రూం మర్డర్ కేసు మిస్టరీ వీడుతుందనే బెదిరింపులు
– దాడులు, దౌర్జన్యాలతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరని జగన్ తెలుసుకోవాలి
– రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

వివేకా హత్య కేసులో అప్రూవర్‌ షేక్ దస్తగిరి తండ్రి షేక్ హజీవలిపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గం. ఒకవైపు చెల్లెల్లు, మరోవైపు వివేకా హత్యలో నిందితుడు దస్తగిరి వాస్తవాలు బహిర్గతం చేస్తారనే భయంతో జగన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. పులివెందులో జగన్ రెడ్డి అరాచకాలకు, అకృత్యాలకు కాలం చెల్లింది.

వైఎస్ ఫ్యామిలీ నాలుగైదు దశాబ్దాలుగా పులివెందులను శాసించారు. ఇప్పుడు వివేకా హత్య కేసులో జగన్ రెడ్డి ముసుగు తొలగిపోవడంతో పులివెందుల ప్రజలే తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఆ ఫ్రస్టేషన్లో దాడులకు తెగబడుతున్నాడు. కేసులు, దాడులు, దౌర్జన్యాలతో భయపెట్టి కాలం నెట్టుకు రావాలని చూస్తున్నారు. వివేకా హత్యకు గొడ్డలి అందించిన చేయి ఎవరిదో దస్తగిరి రెండు రోజుల క్రితం బయటపెట్టాడు.

జగన్ రెడ్డీ.. ఇలాంటి హత్యా రాజకీయాలకు, దాడులు, దౌర్జన్యాలకు కాలం చెల్లింది. ప్రజాస్వామ్య దేశంలో ఇంకా నీ నియంతృత్వ పోకడలు, ఫ్యాక్షన్ వ్యవహారం చెల్లదు. దస్తగిరి తండ్రిపై దాడి చేయడంతోనే పులివెందులలో జగన్ రెడ్డి ఓటమి ఖరారైపోయింది. తక్షణమే దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి. దస్తగిరి కుటుంబానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలి.

 

LEAVE A RESPONSE