Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ డ్రగ్ మాఫియాలో అడ్డంగా దొరికిన జగన్ గ్యాంగ్

-జనవరి 14 న బ్రెజిల్ శాంటోజ్ పోర్టు నుంచి బయలుదేరిన కంటైనర్‌ను జనవరి 17 వ తేదిన బ్రెజిల్ వ్యవసాయ శాఖ తనిఖీ చేసి సర్టిఫికేట్ ఎలా ఇచ్చిందో జగన్ డ్రగ్ మాఫియా జవాబు చెప్పాలి
-22.03.2024 న సంధ్యా ఆక్వా ఇచ్చిన పత్రిక ప్రకటనలో డ్రగ్ కంటైనర్‌ను బ్రెజిల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు 17.01.2024 న తనిఖీ చేసి సర్టిపై చేసిన తర్వాతనే కంటైనర్‌ను అక్కడ నుంచి విశాఖకు పంపినట్లు చెబుతున్నారు
-కానీ, ఎస్.ఈ.కె.యు 4375380 కంటైనర్‌ను ట్రాన్స్ పోర్ట్ చేసిన ఓషన్ నెట్ వర్క్ ఎక్స్ ప్రెస్ సంస్థ వారు న్యావివోస్ డొమినియో అనే షిఫ్ ద్వారా 14.01.2024 సాయంత్రం 07.35 నిమిషాలకే బ్రెజిల్ శాంటోజ్ పోర్టు నుండి తరలించినట్లు వారి వెబ్ సైట్‌లో పేర్కొన్నారు
-జనవరి 14 న బయలు దేరిన కంటైనర్‌లోని పదార్ధాలను జనవరి 17 న బ్రెజిల్ వ్యవసాయ శాఖ వారు ఎలా తనిఖీ చేస్తారు? ఎలా సర్టిఫికేట్ ఇస్తారు?
కంటైనర్ లో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ పరిక్షలు చేసి తేల్చిన తర్వాత ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి బ్రెజిల్ వ్యవసాయ శాఖ సర్టిఫికేట్ నాటకానికి తెరలేపి జగన్ డ్రగ్ మాఫియా అడ్డంగా దొరికిపోయింది
-ఇలాంటి అవాస్తవాలతో జగన్ రెడ్డి డ్రగ్ మాఫియా సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రై.లి వారితో పత్రికా ప్రకటనలు ఇప్పించి ప్రజలను ప్రక్కదారి పట్టించాలని చూస్తున్నారు
– కీలకమైన ఫైళ్లు, హార్డ్ డిస్క్‌లు, చెక్‌బుక్‌లతో దొరికిన సంధ్యా ఆక్వా బస్సును పోలీసులు సిబీఐకి అప్పగించకుండా తిరిగి కంపెనీ వారికే ఎందుకు అప్పగించారు?
– విచారణకు సిబిఐకి సహకరిస్తున్నామని చెబుతూ పోలీసులు ఇలా ఎలా చేస్తారు?
– 25 వేల కిలోల మత్తుపదార్ధులు కలిపియున్న డ్రై ఈస్ట్ కంటైనర్ కేసులో దొరికిన కీలక ఆధారాలను తిరిగి కంపెనీకే అప్పగించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి
– సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ వారి ఆఫీస్‌ను సిబిఐ తనిఖీ చేసే అవకాశం ఉందనే కీలక పత్రాలను, హార్డ్ డిస్క్‌లను బస్సులో నింపి బయటకు పంపారు
– వైసీపీ నాయకుల డ్రగ్స్ వ్యవహారాన్ని ప్రక్కదారి పట్టించేందుకే పోలీసులు 24 గంటలు శ్రమిస్తున్నట్టు ఉన్నారు
– తాడేపల్లి ఫ్యాలెస్ ఆదేశాలతోనే కీలక పైళ్లతో దొరికిన బస్సును పోలీసులు తిరిగి కంపెనీ వారికే భద్రంగా అప్పగించారు
-తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

మంగళగిరి: జగన్ రెడ్డి డ్రగ్ మాఫియా సంధ్యా ఆక్వా ఎక్స్ ‌పోర్స్ వారితో తప్పుడు పత్రికా ప్రకటనలు ఇప్పిస్తూ..విశాఖలో పట్టుబడ్డ డ్రగ్ కంటైనర్ వ్యవహారాన్ని ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, దొరికిన ఆధారాలను రాష్ట్ర పోలీసులు విచారణ చేస్తున్న సిబిఐ వారికి అప్పగించకుండా కంపెనీకే తిరిగి అప్పగించి జగన్ రెడ్డి డ్రగ్ మాఫియాను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విరుచుకుపడ్డారు.

విశాఖ డ్రగ్ కటైంనర్ వ్యవహారంలో సంచలనాత్మక విషయాలు బయటపడ్డాయంటూ మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ‘సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రై.లి కంపెనీకి చెందిన బస్సు కాకినాడలోని కొత్తమూలపేట ఎస్ఈజెడ్ ప్రక్కన రెండు, మూడు రోజులుగా అనుమానస్పదంగా నిలిచి ఉండటాన్ని గమనించిన స్థానిక ప్రజలు పోలీసులకు పిర్యాదు చేశారు.

పోలీసు తనిఖీలో సంధ్యా ఆక్వాకు చెందిన కీలక ఫైళ్లు, హార్డ్ డిస్క్‌లు, చెక్‌బుక్‌లు బస్సు నిండా దొరికాయి. తనిఖీ చేసిన పోలీసు అధికారులు వాటిని విశాఖ డ్రగ్ కేసును విచారిస్తున్న సిబిఐకి అప్పగించకుండా తిరిగి సంధ్యా ఆక్వా కంపెనీ వారికే అప్పగించడం అత్యంత విడ్డూరం. వేల కోట్ల రూపాయలు విలువ గల మత్తు పదార్ధాల దిగుమతి కేసులో దొరికిన కీలక ఆధారాలను తిరిగి నిందితులకే అప్పగించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని ఘాటుగ ప్రశ్నించారు.

‘సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రై.లి ఆఫీస్‌ను సిబిఐ అధికారులు తనిఖీ చేసే అవకాశం ఉందని భావించిన కంపెనీ వారు వారికి సంబంధించిన కీలక ఫైళ్లు, హార్డ్ డిస్క్‌లు, చెక్‌బుక్స్, ఇతర ముఖ్య డాక్యుమెంట్లను సిబిఐ వారికి దొరక్కుండా చేయాలనే ఉద్దేశంతో బస్సులో నింపి అక్కడ నుంచి తరలించారు. ఇది సామాన్యుడికి సైతం అర్ధమయ్యే విషయం.

కానీ, పోలీసు అధికారులు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే తమ చేతికి చిక్కిన సంధ్యా ఆక్వా బస్సును తిరిగి వారికే భద్రంగా అప్పగించారు. ఈ విధంగా ధర్యాప్తును నీరుగారుస్తూ..ఆధారాలను మాయం చేస్తూ.. జగన్ డ్రగ్ మాఫియా చేతిలో తోలుబొమ్మల్లా మారిన పోలీసు అధికారులు తాము అన్ని రకాలుగా విచారణకు సహకరిస్తున్నామని చెప్పడం హాస్యాస్పదం.

విశాఖ పోలీస్ కమీషనర్ రవిశంకర్ అయ్యన్నార్ సైతం తాము ఎక్కడా విచారణకు అడ్డుపడటం లేదని సిబిఐకి అన్ని రకాలుగా తమ తోడ్పాటు అందిస్తున్నామని కొద్ది రోజుల క్రితం మీడియా ముఖంగా తెలియజేశారు. అయ్యా! రవిశంకర్ గారు విచారణకు తోడ్పడటం అంటే దొరికిన ఆధారాలను మాయం చేయడమా? నేటి పరిణామాలు చూస్తుంటే జగన్ రెడ్డి డ్రగ్ మాఫియాను కాపాడేందుకే పోలీసులు 24 గంటలు శ్రమిస్తున్నారనిపిస్తోంది.

సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ వారితో తప్పుడు పత్రికా ప్రకటన ఇప్పించిన జగన్‌రెడ్డి డ్రగ్ మాఫియా
సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రై.లి వారు 22.03.2024 న ఒక తప్పుడు పత్రికా ప్రకటన విడుదల చేసి ప్రజలను, దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అందులో తాము దిగుమతి చేసుకున్న డ్రై ఈస్ట్ కంటైనర్‌ను బ్రెజిల్ వ్యవసాయ మంత్రిత్వశాఖ వారు 17.01.2024 న తనిఖీ చేసి సర్టిఫికేట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

కానీ, వాస్తవానికి కంటైనర్‌ను ట్రన్స్ పోర్టు చేసిన ఓషన్ నెట్వర్క్ సంస్థ వారు సదరు కంటైనర్ ను 14.01.2024 సాయంత్రం 7.35 నిముషాలకు న్యావియోస్ డొమినియో ఓడ ద్వారా తరలించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. తరువాత 05.02.2024 న కంటైనర్ ను హ్యంబర్గ్ పోర్టుకు చేరుకుని జిన్ లియాన్ యున్ గాంగ్ అనే షిప్ లోకి మార్చి న తర్వాత విశాఖకు పంపారు.

జనవరి 14 సాయంత్రం 7.35 నిముషాలకు బ్రెజిల్ శాంటోజ్ పోర్టు నుంచి బయలు దేరిన కంటైనర్ ను జనవరి 17 న బ్రెజిల్ వ్యవసాయ శాఖ వారు ఏ విధంగా తనిఖీ చేసి సర్టిఫికేట్ జారీ చేయగలరు? జగన్ డ్రగ్ మాఫియా చేతిలో కీలుబొమ్మ మారిన సంధ్యా ఆక్వా వాస్తవాలను కప్పిపుచ్చుతూ నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలను వండివారిస్తున్నారనడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి.

ఓషన్ నెట్‌వర్క్ ఎక్స్‌ప్రెస్ వారు ఎస్.ఈ.కె.యు 4375380 నంబర్ గల కంటైనర్‌ను ఏరోజు ఎప్పుడు, ఎక్కడ నుంచి తరలించారనే పూర్తి వివరాలు వారి వెబ్‌సైట్‌లో చాలా వివరంగా పొందుపరిచారు.
ఆ వివరాలు…
1. ఖాళీ కంటైనర్ డిసెంబర్ 29, 2023 న ట్రాన్సిట్ వరల్డ్ లాజిస్టికా కంపెనీ యార్డుకు తరలించడమైనది.
2. అక్కడ లోడ్ అయిన కంటైనర్‌ను 14.01.2024 న శాంటోజ్ పోర్టుకు తీసుకువచ్చి అదేరోజు కంటైనర్‌ను న్యావివోస్ డొమినియో అనే షిప్‌లోకి మధ్యాహ్నం 3.30 నిముషాలకు చేర్చారు.
3. న్యావివోస్ డొమినియో ఓడ శాంటోజ్ పోర్టు నుంచి బయలు దేరి సదరు కంటైనర్ 05.02.2024 న హ్యంబర్గ్ పోర్టుకు చేర్చింది.
4. 08.02.2024 న కంటైనర్ జిన్ లియాన్ యున్ గాంగ్ ఓడలో హ్యాంబర్గ్, జర్మనీ నుంచి బయలు దేని 16.03.2024 న విశాఖపట్నం పోర్టుకు చేరింది.

వాస్తవాలు ఈ విధంగా ఉంటే..జగన్ రెడ్డి డ్రగ్ మాఫియా సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రై.లి వారి చేత తప్పుడు పత్రికా ప్రకటనలు ఇప్పించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. ఈ రోజు మేం బయటపెడుతున్న ఈ కీలకమైన ఆధారాలకు జగన్ రెడ్డి డ్రగ్ మాఫియా ఏ జవాబు చెబుతుంది?

విశాఖపట్నం గంజాయి, మత్తుపదార్ధాల రవాణకు ఒక ట్రాన్సిట్ పాయింట్‌గా మారిపోయిందని స్వయంగా విశాఖపట్నం పోలీస్ కమీషనరే మీడియా ద్వారా తెలియజేయడం నిజంగా సిగ్గుచేటు. కంటైనర్ లో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ పరిక్షలు చేసి తేల్చిన తర్వాత ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి బ్రెజిల్ వ్యవసాయ శాఖ సర్టిఫికేట్ నాటకానికి తెరలేపి అడ్డంగా దొరికిపోయారు.

ఒకవైపు తప్పుడు పత్రికా ప్రకటనలు ఇప్పిస్తూ..మరో వైపు దొరికిన కీలన ఆధారాలను ఖాకీల సహాయంతో మాయం చేస్తూ జగన్ డ్రగ్ మాఫియా డ్రగ్ కంటైనర్ వ్యవహారాన్ని సమాధి చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. గతంలో పెట్బుబడులకు స్వర్గధామంగా ఉన్న విశాఖను మాదక ద్రవ్యాల రవాణ ట్రాన్సిట్ పాయింట్ గా నేడు సైకో జగన్ మార్చాడు. ముంద్రా పోర్టు వ్యవహారం నుంచి విశాఖ డ్రగ్ కంటైనర్ వరకు పట్టుబడిన ప్రతీ డ్రగ్ వ్యవహారం తాడేపల్లి ప్యాలెస్ వైపు వేలెత్తి చూపుతున్నాయి.

రాష్ట్రాన్ని మత్తుపదార్ధాల అడ్డాగా మార్చి వేల కోట్లు మింగుతూ యువత జీవితాలతో సైకో జగన్ ఆడుకుంటున్నాడు. నేడు రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో ఎక్కవ మంది మాదకద్రవ్యాలు, మద్యానికి బానిసలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. జగన్ రెడ్డి తన ధనదాహం తీర్చుకోవడం కోసం బిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నాడు.

నా పత్రికా సమావేశం చూస్తున్న ప్రతి ఒక్కరు ఓషన్ నెట్‌వర్క్ ఎక్స్ ప్రెస్ వెబ్ సైట్‌లోకి వెళ్లి కంటైనర్ నంబర్ వివరాలు ఆధారంగా వాస్తవాలను తెలుసుకుని రాష్ట్రంలో డ్రగ్ మాఫియాను నడిపిస్తున్న జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నాం.

LEAVE A RESPONSE