Suryaa.co.in

Devotional

జ్వాలా తోరణం

మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది…యమ లోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం…యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి, వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష…కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలం జ్వాలా తోరణం చేస్తారు, కార్తీక మాసం లో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచా రం మనకు కనబడదు.

కార్తీక పౌర్ణమినాడు శివాల యాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి… ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు, అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చిచుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంటపెడతారు… ఆ మంట కింద నుంచి పరమే శ్వరుడిని పల్లకిలో అటూఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు.

శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహో త్సవాన్ని భీమేశ్వర పురాణం లో వర్ణిస్తూ…”కార్తీక వేళ భీమ శంకరుని నగరమందుదూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు
వాడు దూరడు ప్రాణనిర్వాణ వేళఘోర భీకర యమద్వార తోరణంబు..’’ అంటాడు.

మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనక ఒక కారణ ముంది…యమలోకంలోకి వెళ్లినవారికి మొదట దర్శన మిచ్చేది అగ్ని తోరణం. యమ లోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికివెళ్లా లి. వాస్తవానికి ఇది పాపు లకు వేసే ప్రథమ శిక్ష, ఈ శిక్షను తప్పించు కోవాలంటే ఈశ్వరు డిని ప్రార్థించటం ఒకటే మార్గం అని అర్థం…అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమ ద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారోవారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది.

అతనికి యమద్వారాన్నిచూడా ల్సిన అవసరం ఉండదు.అందు కే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలని పురాణా లు తెలు పు తున్నాయి… దీని వెనక మరో తత్వకోణం కూడా ఉంది, జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే ‘‘శివా ! నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి, వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీబాట లోనే నడుస్తా’’ అని ప్రతీ కాత్మకంగా చెప్పటం.

ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి – ఇంటి చూరులోనో.. గడ్డి వాము లోనో.. ధాన్యా గారం లోనో పెడ తారు. అది ఉన్న చోట్ల భూత ప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని.. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగు తాయని నమ్మకం… సమస్త లోకా సుఖినోభవంతు.

సేకరణ

LEAVE A RESPONSE